• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

చచ్చిపోయి బతికిపోయాడు !

Published on : October 3, 2019 at 4:58 pm

మహాముదురు ఒకడు ఒకరికి తెలియకుండా ఒకర్ని పెళ్లి చేసుకుని ఏడు చోట్ల కాపురం పెట్టాడు. అంటే ఏడుగురు పెళ్లాలన్న మాట. రాజు గారి ఏడు చేపల్లా ! ఈ ఏడుగురితో ఎలా మేనేజ్ చేసేవాడో కానీ, సడెన్‌గా అతను పోయాడు. అది కూడా ఆత్మహత్య చేసుకుని మరీ పోయాడు. అప్పుడు తెలిసింది ప్రపంచానికి అయ్యగారి ఏడు పెళ్లిళ్ల స్టోరీ..


ఢిల్లీ: ఒక వ్యక్తి మృతదేహం కోసం ఏడుగురు మహిళలు ఆందోళనకు దిగారు. అందరూ కూడా అతగాడే నా మొగుడు అంటూ గొడవ పడుతున్నారు. ఇది కాస్తా ఘర్షణగా మారడంతో పోలీసులు సీన్‌లోకి వచ్చారు. ఏంటి సంగతి అని ఆరా తీశారు. తీరా వారు చెప్పిందంతా విని తలలు పట్టుకున్నారు. అందరూ కూడా అతడే మొగుడని బల్లగుద్ది చెబుతున్నారు. నేనే అతని భార్య అని ఒకరంటే, కాదు.. నేనే అతని భార్య అని మరొకామె అంటోంది. ఛస్.. అసలు పెళ్లాన్ని నేనే అంటూ ఇంకో ఆమె ముందుకొస్తోంది. అలా ఏడుగురూ కూడా ఎవరి ఆర్గ్యుమెంట్లు వారు చేస్తున్నారు. మొత్తం మీద పోలీసులకు అర్ధమైంది ఏంటంటే.. చనిపోయిన వ్యక్తికి వీరంతా భార్యలే. అదే మేటర్ అక్కడున్న వారికి చెప్పారు. దాంతో ఊరు ఊరంతా షాకయ్యింది.

హరిద్వార్‌లోని రవిదాస్ బస్తీలో ఇది జరిగింది. ఈ బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలిస్తే చనిపోయాడని డాక్టర్లు చెప్పేశారు. తర్వాతే అసలు స్టోరీ షురూ అయ్యింది. ఇంటికి శవం రావడం చూసి అతని భార్య ఏడుపు మొదలెట్టింది. ఇంతలో అక్కడికి మరో ఆరుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. అందరూ నా మొగుడు పోయాడంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. డెడ్ బాడీని అప్పగించాలంటూ ఎవరికి వారు గొడవకు దిగారు. అక్కడున్న వారికి ఏమీ అర్థంకాక అలా చూస్తుండిపోయారు. ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటున్న ఏడుగురు పెళ్లాల్ని చూసి జనం సినిమా చూసినట్టు చూశారు. ఇంతలో పోలీసులు వచ్చి అసలే సంగతి కనుక్కున్నాక గొడవ సర్దుమణిగింది. ఎలాగో అలా అతని అంత్యక్రియలయితే నిర్వహించారు. కానీ, ఈ గొడవపై అప్పుడే ఒక డెసిషన్‌కు రాలేమని, కొన్నాళ్లు ఆగితే వారి మధ్య ఒక అవగాహన వస్తుందని పోలీసులు పెదరాయుడి తీర్పులా చెప్పేసి వెళ్లిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీళ్లంతా ఒకే వ్యక్తికి భార్యలమని అప్పటి వరకు ఏ ఒక్కరికీ తెలియకపోవడం. చనిపోయాక తెలిసింది కాబట్టి ఆ మనిషి బతికిపోయాడు. లేకపోతే అప్పుడు వాళ్ల చేతిలో తన్నులు తిని చచ్చేవాడు..

tolivelugu app download

Filed Under: అవీ ఇవీ..., బిగ్ స్టోరీ

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పూజా హెగ్డే కి అంత డిమాండ్ ఎందుకో ?

పూజా హెగ్డే కి అంత డిమాండ్ ఎందుకో ?

ఆచార్య నుంచి మరో అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్ ?

ఆచార్య నుంచి మరో అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్ ?

ఆస్కార్ బరిలో ఆకాశం నీ హద్దురా !!

ఆస్కార్ బరిలో ఆకాశం నీ హద్దురా !!

తెర‌పైకి మ‌నం-2?

తెర‌పైకి మ‌నం-2?

చిరంజీవితో ప్రదీప్ మాచిరాజును ను పోల్చడం సరియేనా ?

చిరంజీవితో ప్రదీప్ మాచిరాజును ను పోల్చడం సరియేనా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

telangana secrateriat

పీఆర్సీపై సీఎంతోనే తేల్చుకుంటాం- ఉద్యోగ సంఘాలు

father mother

మ‌ద‌న‌ప‌ల్లె కూతుళ్ల హ‌త్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు

రైత‌న్న పార్ల‌మెంట్ ర్యాలీ వాయిదా...?

రైత‌న్న పార్ల‌మెంట్ ర్యాలీ వాయిదా…?

ఫిబ్రవరి 18న‌ ఐపీఎల్ వేలం

ఫిబ్రవరి 18న‌ ఐపీఎల్ వేలం

రాజ‌కీయాల్లోకి చిరంజీవి రీఏంట్రీ- ఇదిగో సాక్ష్యం

రాజ‌కీయాల్లోకి చిరంజీవి రీఏంట్రీ- ఇదిగో సాక్ష్యం

బాంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై సుప్రీం స్టే

బాంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై సుప్రీం స్టే

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)