• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » మూడు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

మూడు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

Last Updated: January 18, 2023 at 4:37 pm

దేశంలో మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ని ఈసీ ప్రకటించింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16 న, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27 న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారం ప్రకటించారు. మార్చి 2 న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో..త్రిపురలో మాణిక్ సాహా నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది.

Poll schedule for 3 NE states to be announced by Jan 19

విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను నిర్ణయించామని రాజీవ్ కుమార్ తెలిపారు. త్రిపురకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 21 న జారీ అవుతుందని, నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీ అని పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 2 చివరితేదీగా వివరించారు. నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు జనవరి 31 న గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 7 చివరి తేదీ అని పేర్కొన్నారు.

నాగాలాండ్ అసెంబ్లీ కాల పరిమితి మార్చి 12 తోను, మేఘాలయ మార్చి 15 తోను, త్రిపుర అసెంబ్లీ కాల పరిమితి మార్చి 22 తోను ముగియనుంది. ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 62.8 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 1.76 లక్షల మంది మొదటిసారిగా ఓటింగ్ లో పాల్గొనబోతున్నారని రాజీవ్ కుమార్ వివరించారు. తమ బృందం ఈ నెల 11 నుంచి 15 వరకు ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించిందని, ఎన్నికల సన్నాహాలకు సంబంధించి సమీక్షా సమావేశాలను నిర్వహించిందని ఆయన చెప్పారు.

మేఘాలయలో 5 గురు ఎమ్మెల్యేల రాజీనామాలు

మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఈసీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించడానికి ముందే మేఘాలయాలో అయిదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరు యునైటెడ్ డెమాక్రాటిక్ పార్టీలో చేరనున్నారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి, ఒకరు తృణమూల్ కాంగ్రెస్ కి, ఒకరు హిల్ స్టేట్ పీపుల్స్ డెమాక్రాటిక్ పార్టీకి చెందినవారు కాగా ఒకరు ఇండిపెండెంట్ సభ్యుడు.

Primary Sidebar

తాజా వార్తలు

మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు షాక్..!

యువకున్ని కొట్టిన ఎస్ఐ… అడ్డుకున్న మాజీ కలెక్టర్….!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం…!

రాహుల్‌ను కాపీ కొట్టిన మాజీ ముఖ్యమంత్రి….!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

సాహితీ ఇన్ ఫ్రా మోసాలన్నింటిని ఒకే కేసుగా పరిగణించండి..!

పోలీసుల నోటీసులకు బండి భగీరథ్ రిప్లై…!

కేసీఆర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..!

ముగిసిన జమున అంత్యక్రియలు

అందుకే తేజస్వీ యాదవ్‌ను సీఎంగా నితీశ్ ఎంచుకున్నారు…!

ఖమ్మం కయ్యం.. కౌంటర్ ఎటాక్స్ తో హీట్ 

ఫిల్మ్ నగర్

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

ముగిసిన జమున అంత్యక్రియలు

ముగిసిన జమున అంత్యక్రియలు

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap