• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » ఉన్న చోటునుంచే ఓటు !!

ఉన్న చోటునుంచే ఓటు !!

Last Updated: December 29, 2022 at 6:45 pm

ఓటింగ్ ప్రక్రియలో వినూత్న విధానానికి ఎన్నికల సంఘం తెరలేపనుంది.ఉపాధి నిమిత్తం దేశంలోని వివిధ నగరాలకు వెళ్లే వలస కార్మికులు.. తమ సొంత నియోజకవర్గంలో రిమోట్‌గా ఓటు వేసేందుకు కొత్త విధానాన్ని తయారు చేసింది. ఇందుకు సహాయపడే రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు ఎన్నికల సంఘం గురువారం తెలిపింది.

ఈ పరికరం దేశంలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా తమ నియోజకవర్గానికి ఓటు వేయడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా సెలవు దొరక్క, ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించి ఓటు వేయడానికి సొంత రాష్ట్రానికి వెళ్లలేని ఓటర్లకు పెద్ద ఉపశమనం ఇవ్వనుంది.

ఈ పరికరాన్ని ప్రదర్శించి, వివరించేందుకు జనవరి 16న రాజకీయ పార్టీలను ఈసీ ఆహ్వానించింది. యంత్రాన్ని అమలు చేయడంలో ఎదుర్కొనే చట్టపరమైన, కార్యాచరణ, పరిపాలనా, సాంకేతిక సవాళ్లపై పార్టీల అభిప్రాయాలను పొందడం కోసం దీనిని ప్రదర్శించనుంది.

” 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్‌ నమోదైంది. దాదాపు 30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఆందోళనకరం. ఓటరు తన కొత్త నివాస ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీంతో చాలా మంది ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు. అంతర్గత వలసల కారణంగా ఓటు వేయలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలా మంది స్వస్థలాలను వదిలివెళ్తున్నారు. దేశంలో దాదాపు 85 శాతం మంది ఇలాంటి వారే. ఇలా వలసలు వెళ్లినవారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఈ రిమోట్ ఓటింగ్‌పై దృష్టిపెట్టాం. ”
-రాజీవ్‌ కుమార్‌, ప్రధాన ఎన్నికల అధికారి

Primary Sidebar

తాజా వార్తలు

”లక్‌” వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

కోటం రెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు..మ్యాన్ ట్యాపింగ్!

పార్క్ చేసిన బైక్ ను 3 కిలో మీటర్ల దూరం లాక్కెళ్ళిన బే’కారు’..!

ఉద్యోగులకు బైజూస్ షాక్… ఈ సారి ఫ్రెషర్లందరినీ ఇంటికి ….!

ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు!

గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు!

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఏం మాట్లాడారంటే!

అమెరికాలో స్పై బెలూన్ కలకలం… డ్రాగన్ కంట్రీ గూఢచర్యం చేస్తోందన్న అమెరికా…!

రూ. 9.5 లక్షల విలువైన నకిలీ నాణేల గుట్టురట్టు …!

రామ మందిరం పేల్చేస్తామంటూ ఫోన్ కలకలం

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

ఫిల్మ్ నగర్

''లక్‌'' వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

”లక్‌” వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు!

ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు!

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

కళాతపస్వికి మోడీ నివాళులు!

కళాతపస్వికి మోడీ నివాళులు!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ''ఎస్‌'' అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap