• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఇళ్ల స్థలాల సమస్య మళ్లీ మొదటికొచ్చింది !

Published on : August 28, 2019 at 11:23 am

రెడ్డొచ్చె మొదలు.. అని పాత తెలుగు సామెత మాదిరి ఇళ్ల స్థలాల సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు న్యాయ‌వాదులు,పేద‌ వర్గాల ప్రజలు, పూజార్లు, ఇమామ్‌లు, పాస్ట‌ర్లు, జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలు అందించే అంశంపై ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీ నియమించింది. ఈ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వాలనే అంశంపై మంత్రుల కమిటీ విధివిధానాలను రూపొందిస్తుంది. మంత్రుల క‌మిటీకి రెవెన్యూ శాఖ మంత్రి చైర్మ‌న్‌గా వుంటారు. మ‌రో ముగ్గురు మంత్రుల‌తో కేబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. స‌భ్యులుగా మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్, పినిపే విశ్వ‌రూప్ ఇందులో ఉంటారు. ఆయా వ‌ర్గాల‌కు ఇళ్ల స్థ‌లాల కేటాయింపునకు విధివిధానాలు రూప‌క‌ల్ప‌న చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు అమరావతిలో భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆలిండియా సర్విస్ అధికారులకు కూడా అమరావతి ప్రైమ్ లొకాలిటీలో ఇళ్లస్థలాలు కేటాయించారు. దీనికి సంబంధించి అప్పట్లో ఆర్టీజీ వ్యవహారాలు చూసే అహ్మద్‌బాబు అప్పటి సీయం చంద్రబాబును ఒప్పించి ఒక్కొక్కరికీ 500 గజాల చొప్పున స్థలాన్ని కేటాయిస్తూ విధానపరమైన నిర్ణయం తీసుకునేలా చేశారు. రాత్రికి రాత్రే సీఆర్డీఏ యంత్రాంగం దీనిపై పనిచేసింది. ఏపీలో పనిచేసే ఆలిండియా అధికారులు, విశ్రాంత అధికారులు 500 చదరపు అడుగుల స్థలాన్ని వన్ డే నైట్ కూర్చుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు జగన్ ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ స్థలాల కేటాయింపును కొనసాగిస్తుందో.. లేక రద్దు చేస్తుందో చూడాలి.

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

నాగ శౌర్యకు హిట్ ఇచ్చిన దర్శకుడికి రామ్ నో చెప్పాడట ?

నాగ శౌర్యకు హిట్ ఇచ్చిన దర్శకుడికి రామ్ నో చెప్పాడట ?

అనసూయ కోసం వెంకీ ...థాంక్ యూ బ్ర‌ద‌ర్ ట్రైలర్ రిలీజ్

అనసూయ కోసం వెంకీ …థాంక్ యూ బ్ర‌ద‌ర్ ట్రైలర్ రిలీజ్

పాపం....తాప్సి కష్టాలు !!

పాపం….తాప్సి కష్టాలు !!

ఓటీటీ లోనే సైనా నెహ్వాల్ బయోపిక్ ?

ఓటీటీ లోనే సైనా నెహ్వాల్ బయోపిక్ ?

పూరీ చాయిస్...మోక్షజ్ఞ లేక పవన్ కళ్యాణా ?

పూరీ చాయిస్…మోక్షజ్ఞ లేక పవన్ కళ్యాణా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

చ‌దువు చెప్పే గురువుల‌కే పంగ‌నామాలా?

చ‌దువు చెప్పే గురువుల‌కే పంగ‌నామాలా?

ప్ర‌ధాన విప‌క్షాల‌న్ని బాయ్‌కాట్.. టీఆర్ఎస్ మాత్రం గ‌ప్‌చుప్‌!

ప్ర‌ధాన విప‌క్షాల‌న్ని బాయ్‌కాట్.. టీఆర్ఎస్ మాత్రం గ‌ప్‌చుప్‌!

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

అయోధ్య మ‌సీదుకు విరాళాలివ్వొద్దు.. అస‌దుద్దీన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

అయోధ్య మ‌సీదుకు విరాళాలివ్వొద్దు.. అస‌దుద్దీన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం - ప్రతిపక్షాలు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం – ప్రతిపక్షాలు

నేను దేశ ద్రోహిని ఎలా అవుతాను.. ఢిల్లీ అల్ల‌ర్ల‌పై దీప్ సిద్ధూ

నేను దేశ ద్రోహిని ఎలా అవుతాను.. ఢిల్లీ అల్ల‌ర్ల‌పై దీప్ సిద్ధూ

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)