• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఇళ్ల స్థలాల సమస్య మళ్లీ మొదటికొచ్చింది !

ఇళ్ల స్థలాల సమస్య మళ్లీ మొదటికొచ్చింది !

Last Updated: August 28, 2019 at 5:57 pm

రెడ్డొచ్చె మొదలు.. అని పాత తెలుగు సామెత మాదిరి ఇళ్ల స్థలాల సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు న్యాయ‌వాదులు,పేద‌ వర్గాల ప్రజలు, పూజార్లు, ఇమామ్‌లు, పాస్ట‌ర్లు, జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలు అందించే అంశంపై ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీ నియమించింది. ఈ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వాలనే అంశంపై మంత్రుల కమిటీ విధివిధానాలను రూపొందిస్తుంది. మంత్రుల క‌మిటీకి రెవెన్యూ శాఖ మంత్రి చైర్మ‌న్‌గా వుంటారు. మ‌రో ముగ్గురు మంత్రుల‌తో కేబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. స‌భ్యులుగా మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్, పినిపే విశ్వ‌రూప్ ఇందులో ఉంటారు. ఆయా వ‌ర్గాల‌కు ఇళ్ల స్థ‌లాల కేటాయింపునకు విధివిధానాలు రూప‌క‌ల్ప‌న చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు అమరావతిలో భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆలిండియా సర్విస్ అధికారులకు కూడా అమరావతి ప్రైమ్ లొకాలిటీలో ఇళ్లస్థలాలు కేటాయించారు. దీనికి సంబంధించి అప్పట్లో ఆర్టీజీ వ్యవహారాలు చూసే అహ్మద్‌బాబు అప్పటి సీయం చంద్రబాబును ఒప్పించి ఒక్కొక్కరికీ 500 గజాల చొప్పున స్థలాన్ని కేటాయిస్తూ విధానపరమైన నిర్ణయం తీసుకునేలా చేశారు. రాత్రికి రాత్రే సీఆర్డీఏ యంత్రాంగం దీనిపై పనిచేసింది. ఏపీలో పనిచేసే ఆలిండియా అధికారులు, విశ్రాంత అధికారులు 500 చదరపు అడుగుల స్థలాన్ని వన్ డే నైట్ కూర్చుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు జగన్ ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ స్థలాల కేటాయింపును కొనసాగిస్తుందో.. లేక రద్దు చేస్తుందో చూడాలి.

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఇదేం రాక్షసత్వం కేసీఆర్!

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

ఆ యాప్స్ ఇక కనపడవు!

థామస్ కప్ విజయంపై ఐఏఎస్ పోస్టు.. మండిపడిన భారత మాజీ క్రికెటర్

రాజ్యసభకు ఆర్‌ కృష్ణయ్య.. తొలివెలుగు ఇంటర్వ్యూ!

తీన్మార్ మ‌ల్ల‌న్నపై రూ..10 కోట్ల దావా..!

మమత సర్కార్ కు సుప్రీం కోర్టు హెచ్చరిక

ఫిల్మ్ నగర్

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

స్టేజ్‌పై చిందులేసిన మహేశ్ బాబు.. వీడియో వైరల్..!

స్టేజ్‌పై చిందులేసిన మహేశ్ బాబు.. వీడియో వైరల్..!

జానీ కాకుండా పవన్ డైరెక్ట్ చేసిన సినిమా ఏదో తెలుసా..?

జానీ కాకుండా పవన్ డైరెక్ట్ చేసిన సినిమా ఏదో తెలుసా..?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)