• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » తెలంగాణ ద్రోహులతో దోస్తీనా..?

తెలంగాణ ద్రోహులతో దోస్తీనా..?

Last Updated: January 10, 2022 at 11:02 am

తెలంగాణ సీఎం కేసీఆర్ కి నిత్యం రాజకీయ క్రీడ తప్ప మరో ప్రజా సమస్యలపై ధ్యాస లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే పొత్తులకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన సీపీఎంతో నయా దోస్తానా చేయడం శోచనీయమని అన్నారు.

తెలంగాణలో సమస్యలు పోగుపడి ఉన్నాయని.. అవన్నీ గాలికొదిలేసి కేసీఆర్ ఎన్నికల పోత్తుల్లో బిజీ అయిపోయారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా పోతుందని ఈటల అన్నారు. జిల్లాల సంఖ్య పది నుంచి 33కి, జోన్లు రెండు నుంచి ఏడుగా మార్చారని గుర్తు చేశారు. రాష్ట్రపతి సవరణ చేసి జీవో నెంబర్ 124 ఇచ్చారని.. స్థానికత ఆధారంగా టీచర్లను, ఉద్యోగులను విభజించాలని డిమాండ్‌ చేశారు.

మూడేళ్ల పాటు కుంభకర్ణ నిద్ర పోయిన తర్వాత జీవో నెంబర్‌ 317 ఇచ్చారని మండిపడ్డారు. తొందరపాటు నిర్ణయంతో జీవో ఆర్డర్‌ ఇవ్వడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య ఒక దగ్గర భర్త మరో దగ్గర, పిల్లలు, కన్నతల్లిదండ్రులు ఇంకో దగ్గర.. ఇలా ఎడబాటు విధించి వారి కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఈ బాధలు తట్టకోలేక టీచర్లు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి సమస్యలను పక్కన పెట్టి.. సీపీఐను ఎలా దగ్గర తీసుకోవాలని సీఎం ఆలోచిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలా పుల్లలు పెట్టాలి? బీజేపీని ఎలా దెబ్బ కొట్టాలి అనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. మళ్లీ గెలవాలని నీతిమాలిన చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.

Primary Sidebar

తాజా వార్తలు

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు

మునావర్‌ ఫారుఖీ షోకి పోలీసుల అనుమతి

రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయి!

కృష్ణాష్టమి వేడుకల్లో … రిషీ సునాక్ దంపతులు…!

ఐటీ గురి.. గ‌ల్ఫ్ ఆయిల్ భూములపైనే! తొలివెలుగు ఎక్స్ క్లూజివ్

ఆ కేసుల్లో నిర్దోషులంతా పరిహారం కోరితే….!

సామ్ ఎందుకింత సైలెంట్ అయింది….!

ఇక బేబమ్మ పని అయిపోయినట్టేనా? ..నెక్స్ట్ స్టెప్ ఏంటి?

అదే సమయంలో కేంద్రం తనిఖీలు శోచనీయం…!

అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ మార్చినట్టు… సీఎం నితీశ్ కూడా ….!

ఏపీకి మరో ముప్పు.. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చాహర్ భార్యతో శ్రేయస్ అఫైర్… చాహల్ ఏమన్నాడంటే..!

ఫిల్మ్ నగర్

సామ్ ఎందుకింత సైలెంట్ అయింది....!

సామ్ ఎందుకింత సైలెంట్ అయింది….!

ఇక బేబమ్మ పని అయిపోయినట్టేనా? ..నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ఇక బేబమ్మ పని అయిపోయినట్టేనా? ..నెక్స్ట్ స్టెప్ ఏంటి?

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది... హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు...!

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది… హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)