• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » కేసీఆర్ కు ప్రజలు చుక్కలు చూపెడుతున్నారు….!

కేసీఆర్ కు ప్రజలు చుక్కలు చూపెడుతున్నారు….!

Last Updated: October 14, 2022 at 7:36 pm

సీఎం కేసీఆర్ తనకు ఆరు నెలలపాటు నరకం చూపిస్తే, తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా మర్రిగూడెం మండలం లంకెలపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  జితేందర్ రెడ్డి, రాజయ్య యాదవ్,  ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తుల ఉమ, ఆచారి, దయానంద్ లు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… లెంకల పల్లికి సీఎం కేసీఆర్ ఇంఛార్జి అని ఆయన గుర్తు చేశారు. ఇక్కడ ఇజ్జత్ పోవద్దని ఒక్కో ఓటుకు రూ. 1 లక్ష ఇస్తాడేమో అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎంత ఇచ్చినా ఆ డబ్బును తీసుకోండంటూ ఆయన తెలిపారు. .

ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టే వ్యక్తి కేసీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు. మునుగోడులో టీఆర్ఎస్‌ను ఓడిస్తే కేసీఆర్ పాలన అంతమవుతుందన్నారు. దీంతో కేసీఆర్ పీడ విరుగుడు అవుతుందని ఫైర్ అయ్యారు. మునుగోడుకు సీఎం కేసీఆర్ ఎన్ని నిధులు ఇచ్చారో చర్చకు రెడీనా అని సవాల్ విసిరారు.

రాచరిక వ్యవస్థలో రాజు సైతం ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని మారు వేషంలో వెళ్లి తెలుసుకునే వారన్నారు. కానీ ఈ సీఎం ప్రగతి భవన్ లోనే ఉంటారన్నారు. ఇనుపకంచె, ఆ వెనుక ఇనుప ముళ్ళు వేసుకొని ఇనుప బూట్ల మధ్య ఉంటాడని ఎద్దేవా చేశారు.

సంక్షేమ హాస్టల్స్‌లో పిల్లలు చనిపోతున్నా కూడా ఫామ్ హౌస్ వదిలి కేసీఆర్ బయటికి విమానాలు కొనేంత డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయని ఆయ ప్రశ్నించారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత మునుగోడు అడబిడ్డల మీద ఉందన్నారు. బీజేపీ గెలిస్తే తెలంగాణ ప్రజలు గెలిచినట్టని ఆయన అన్నారు.

 

Primary Sidebar

తాజా వార్తలు

ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు.. అమెరికా ‘ఆక్రోశం’

భూకంప విలయం.. పాకిస్తాన్ లో 11 మంది మృతి

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాము విషాన్ని నోటితో తీసి తల్లిని కాపాడుకున్న కూతురు…!

ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ..!

చైనాలో మరణ మృదంగానికి జిన్ పింగ్ వైఫల్యమే కారణమా..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

ఫిల్మ్ నగర్

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap