• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Opinion » లోకేశ్ యాత్ర అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయి!

లోకేశ్ యాత్ర అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయి!

Last Updated: January 22, 2023 at 2:30 pm

జవహర్, మాజీ మంత్రి

టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ పాదయాత్రకు సిద్ధమౌతున్నారు. ఆయన యాత్రను అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పాదయాత్ర ప్రారంభం కాకముందే జగన్మోహన్ రెడ్డికి, ఆయన వర్గానికి, వైసీపీ నాయకులకు పాంట్లు తడిసిపోతున్నాయి. లోకేశ్ యాత్రను ఏదో విధంగా అడ్డుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా అధికారుల స్థానచలనాలు ఏవిధంగా ఉంటున్నాయి? రాష్ట్రంలో రాజకీయం ఏవిధంగా మారబోతోంది అని ఆందోళనపడుతున్నారు.

జీవో నెంబర్ 1 ను అడ్డం పెట్టుకొని లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. జీవో నెంబర్ 1ను సాకుగా చూపి యాత్ర వివరాలు అడగడం చేస్తున్నారు. వైసీపీ నాయకులు, అధికారులు భయపడుతున్నారనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. లోకేష్ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలుకనున్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బడుగు బలహీనవర్గాలవారు లోకేశ్ పాదయాత్రకై ఎదురుచూస్తున్నారు.

ప్రధానంగా యువత వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. లోకేష్ వస్తే వారికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇందుకుగాను ఆయన చేస్తున్న యువగళం కార్యక్రమానికి గొంతెత్తి యువత అండగా ఉండడానికి వస్తోంది. డీజీపీ, పోలీసులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు ఉలిక్కి పడుతున్నారు. జీవో నెంబర్ 1ని సాకుగా చూపి అడ్డుకోవాలని చూస్తున్నారు. అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా పాదయాత్ర జరుగుతుంది.. జరిగి తీరుతుంది.

ఈ పాదయాత్రకు ఎవరూ పర్మిషన్ అవసరం లేదు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, యువత ఉపాధి కోసం, దళితుల రక్షణ కోసం, బడుగుల ఆత్మస్థైర్యం కోసం లోకేశ్ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రను పెద్ద ఎత్తున ప్రజలు విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాసుకోండి.. చూసుకోండి.. మీకు కళ్లుండి కబోదుల్లాగా వ్యవహరిస్తున్నారు. చెవులుండి చెవిటివారిలా చేస్తున్నారు. డీజీపీ నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.

Primary Sidebar

తాజా వార్తలు

బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్…!

దమ్ముంటే రాజీనామా చెయ్.. పువ్వాడ సవాల్!

షర్మిల నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రాకి వెళ్లిపో!

300 కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్!

నా పిల్ అడ్డుకుంటున్నారు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు… సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కార్…!

ఆ ఛీతాలు మా పార్టీకి చేటు.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే గోడు

అరుదైన రికార్డులకు దగ్గర్లో అశ్విన్!

ఒకే రోజు మూడు పరీక్షలు… ఆందోళనలో అభ్యర్థులు…!

మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు!

అక్కినేని మాట వినకుండా భానుమతి ఎంత నష్టపోయారో తెలుసా…?

తెలంగాణలో మరోసారి ఐపీఎస్ ల బదిలీలు

ఫిల్మ్ నగర్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

ఆమెకు  ఆ  సినిమాల్లో రాని గుర్తింపు  అఖండతో  వచ్చిందిగా..!

ఆమెకు ఆ సినిమాల్లో రాని గుర్తింపు అఖండతో వచ్చిందిగా..!

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap