కరోనా బారిన పడి కన్నుమూసిన మాజీ మంత్రి మాణిక్యాలరావుకు తుది వీడ్కోలు పలికారు. తాడేపల్లిగూడెంలోని మానవతా శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. మాణిక్యాలరావు అంత్యక్రియలకు ఆయన కుటుంబసభ్యులతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు.
కరోనా కారణంగా కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. డీఎస్పీ కె.రాజేశ్వర రెడ్డి, ఆర్డీవో రచన, మున్సిపల్ కమిషనర్ బాల స్వామి, పోలీస్ అధికారులు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది