• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » కొంపముంచిన 50 లక్షలు

కొంపముంచిన 50 లక్షలు

Last Updated: June 14, 2022 at 5:41 pm

వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయుల వాయిస్ వినిపించేందుకు గాను ‘నేషనల్‌ హెరాల్డ్‌’ పత్రికను 1938లో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. దీని నిర్వహణ బాధ్యతలను అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌) సంస్థ చూసుకునేది.

ఈ పత్రికు ప్రధాన దాత నెహ్రూ కాగా సుమారు 5 వేల మంది స్వతంత్ర్య సమరయోధులు వాటాదారులుగా ఉండేవారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్‌ కు అధికార పత్రికగా నేషనల్‌ హెరాల్డ్‌ (ఆంగ్లం) ఉండేది. ఇది ఉర్దూలో ‘క్వామీ అవాజ్‌’గా , హిందీలో ‘నవజీవన్‌’గా వెలువడేది.

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక 2008లో మూతపడింది. అప్పటకి ఆ పత్రిక కాంగ్రెస్ కు రూ.90.25 కోట్ల మేర బకాయిపడింది. దీనికి ఎలాంటి వడ్డీలు వసూలు చేయలేదు.

2009లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ రెండో సారి అధికార పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలో 2010లో లాభాపేక్షలేని దాతృసంస్థగా యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌(వైఐఎల్‌) ప్రారంభమైంది. దీనికి డైరెక్టర్ గా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఉన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ నేతలు ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, మోతీలాల్‌ వోరాలు ఆ సంస్థలో భాగస్వాములు. తర్వాత కాలంలో మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ మరణించారు.

తనకు బకాయిపడిన ఏజేఎల్ ను 2011లో యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌కు కాంగ్రెస్ అప్పగించింది. దీంతో ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ కు వైఐఎల్ రూ.50 లక్షలను చెల్లించి నేషనల్‌ హెరాల్డ్‌ హక్కులను దక్కించుకుంది. దీంతో 2016లో ఏజేఎల్‌ తన పత్రికను మూడు భాషల్లో పునఃప్రారంభించింది.

ఈ క్రమంలో నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని, అందులో సోనియా, రాహుల్ గాంధీల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ కోర్టులో 2012లో పిటిషన్ వేశారు.

వైఐఎల్ సంస్థ మూలధన పెట్టుబడి రూ. 5 లక్షలు మాత్రమేనని సుబ్రహ్మణ స్వామి ఆరోపించారు. కోల్ కతాకు చెందిన డొటెక్స్‌ మర్చెండైజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి వైఐఎల్ సంస్థ రూ.కోటి రుణం తీసుకుందని, దానిలో నుంచి రూ. 50 లక్షలను కాంగ్రెస్ కు చెల్లించిందని ఆయన ఆరోపించారు.

మూతపడిన మీడియా సంస్థ ఐజేఎల్ కు చెందిన రూ. 2వేల కోట్లకు పైగా విలువగల భూములను వైఐఎల్ మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే రూ.90.25 కోట్లను వడ్డీలేని రుణంగా ఏజేఎల్‌కు ఇచ్చామని, అందువల్ల ఇది సక్రమమేనని కాంగ్రెస్‌ వాదిస్తోంది. ఏజేఎల్‌ అనేది తమ అనుబంధ సంస్థేనని, మూతపడిన సంస్థను, దానికి చెందిన పత్రికలను పునరుద్ధరించడం తమ పార్టీ బాధ్యత అని పేర్కొంది. ఇందులో యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌ దాతృత్వ సంస్థ మాత్రమేనని దానికి ఎలాంటి లాభార్జనా ఉద్దేశం లేదని అంటోంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

నిజామాబాద్ లో పీఎఫ్ఐ ముఠా.. ఎంపీ ఆగ్రహం!

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్!

ధరణి దోపిడీ.. రద్దు కోసం కాంగ్రెస్ ఉద్యమం!

పాపం పసివాడు…!

అల్లూరి విగ్రహం… బీజేపీ అదిరిపోయే ప్లాన్.. !

ఓరుగల్లులో ఇస్కాన్ జగన్నాథ రథోత్సవానికి సర్వం సిద్ధం.

రాణి నందిని.. ప్రతీకారానికి అందమైన ముఖం!

కేంద్రమంత్రి నఖ్వీ రాజీనామా.. అందుకేనా?

కలుషిత నీటి కలకలం.. ఇద్దరి మృతి

సీఎం రెండో పెళ్లి.. అంతా రెడీ!

భారత్‌ ను దాటేసిన పాక్‌

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షాక్..!

ఫిల్మ్ నగర్

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్!

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్!

రాణి నందిని.. ప్రతీకారానికి అందమైన ముఖం!

రాణి నందిని.. ప్రతీకారానికి అందమైన ముఖం!

గౌతంరాజు మృతిపై చిరంజీవి ఎమోషనల్ నోట్

గౌతంరాజు మృతిపై చిరంజీవి ఎమోషనల్ నోట్

అనుకోకుండా కోలీవుడ్ ఎంట్రీ

అనుకోకుండా కోలీవుడ్ ఎంట్రీ

కోలీవుడ్ కు మరో మాస్ హీరో దొరికాడు

కోలీవుడ్ కు మరో మాస్ హీరో దొరికాడు

పెళ్లిపై మరోసారి స్పందించిన లావణ్య త్రిపాఠి

పెళ్లిపై మరోసారి స్పందించిన లావణ్య త్రిపాఠి

ఎఫ్3 మూవీ క్లోజింగ్ కలెక్షన్

ఎఫ్3 మూవీ క్లోజింగ్ కలెక్షన్

చిట్ చాట్.. చాలా విషయాలు బయటపెట్టిన మిల్కీబ్యూటీ

చిట్ చాట్.. చాలా విషయాలు బయటపెట్టిన మిల్కీబ్యూటీ

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)