తిరుమలలో అమలులోకి వచ్చిన ఫేస్ రికగ్నిషన్ విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు.
ఈ విధానంతో నిజమైన భక్తులే గదులు పొందుతున్నారన్నారు. ఈ విధానం ప్రవేశ పెట్టడంతో భక్తులకు త్వరగతిన గదులు లభిస్తున్నాయని తెలిపారు. సర్వదర్శనం భక్తులకు ఈ విధానం ద్వారానే ఉచిత లడ్డు టోకెన్లను జారీ చేస్తున్నట్లు చెప్పారు.
రానున్న రోజుల్లో ఈ విధానాన్ని ఇంకా పటిష్టం చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. మార్చి 1 నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ యాప్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ చెల్లింపునకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ప్రయోగాత్మకంగా అమలు చేసింది టీటీడీ. ఈ యాప్ ద్వారా దర్శనం, లడ్డూల పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశం ఉండదని టీటీడీ భావిస్తోంది.