• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » మా పొట్ట కొట్టొద్దు.. మాకు న్యాయం చేయండి సారూ..!

మా పొట్ట కొట్టొద్దు.. మాకు న్యాయం చేయండి సారూ..!

Last Updated: January 30, 2022 at 3:21 pm

సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువునీరు తమ పొలాలకు రాకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జిల్లా పరిధిలోని ఆందోల్ నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆందోల్ గ్రామంలోని తిరుమలయ్య చెరువును నమ్ముకొని 200 మంది రైతులు 186 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఇందులో 50 ఎకరాల భూమి చెరువు శిఖంలో ఉంది.

50 ఎక‌రాల్లో నాందేడ్, ఆకొల జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 12.6 ఎకరాల భూమిని ఓ వ్యాపార వేత్త కొనుగోలు చేశాడు. అయితే.. ఈ భూమి రహదారి పక్కనే ఉండటంతో వర్షానికి వచ్చే వరదతో భూమి నీటిలో మునిగిపోతోంది. దీంతో ఆ వ్యాపార వెత్త మల్లన్నగుట్ట, తిరుమలయ్య గుట్ట ప్రాంతాలనుండి మట్టి తోడుకొచ్చి తన భూమిలో పోస్తున్నాడు. అతను కొన్న భూమి చెరువు శిఖం అయినప్పటికీ.. రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని చెరువు భాగాన్ని పట్టా చేయించుకున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు.

మట్టితో పూడికపోయడంతో చెరువు కింద భూములున్న 200 మంది రైతుల వ్యవసాయానికి సింగూర్ కెనాల్ నుండి వచ్చేటటువంటి నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతంలో భూములున్న రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులను, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా ప్రయోజనం లేదని మొరపెట్టుకుంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు తమ గోడును విన్నవించుకున్నా.. పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడని రైతులు ఆవేదన చెందుతున్నారు.

దీంతో చేసేదేం లేక రైతులు ధర్నాకు పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేపట్టారు. తాము ఎవరినీ ఏమీ అనడంలేదని.. తమ చెరువులోకి నీరు సజావుగా రావడానికి కొట్లాతున్నామని పేర్కొన్నారు. వ్యాపారవేత్త అడ్డంగా పోసిన మట్టిని తొలగిస్తే తమకు ధ‌ర్నా చేయాల్సిన అవసరం ఏముందని వాపోతున్నారు బాధిత రైతులు. మట్టిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

పోడు పోరు.. ప్రగతి భవన్‌ ముట్టడి!

మోడీ గో బ్యాక్‌.. నల్ల బెలూన్లతో నిరసన

సంజయ్ రౌత్ కు షాక్..!

త్వరలోనే అల్లూరి భవనం నిర్మిస్తాం : మంత్రి కేటీఆర్

బీజేపీ మీటింగ్‌.. టీఆర్‌ఎస్‌ ఎటాక్‌!

బిజెపి సమాధానం ఇచ్చేంత సీన్ కేసీఆర్ కు లేదు : బండి

మంత్రిపై కేసు పెట్టిన వ్యక్తి ఆఫీస్‌ ధ్వంసం!

తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా..

ఉద్దవ్ వర్గానికి షిండే గ్రూప్ షాక్….!

ముగిసిన బలపరీక్ష… !

టీఆర్ఎస్ కు షాక్.. హస్తం గూటికి ముగ్గురు కౌన్సిలర్లు

అన‌సూయ స్థానంలో కొత్త యాంక‌ర్..!

ఫిల్మ్ నగర్

అన‌సూయ స్థానంలో కొత్త యాంక‌ర్..!

అన‌సూయ స్థానంలో కొత్త యాంక‌ర్..!

'మాచర్ల..' సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్

‘మాచర్ల..’ సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్

ఎప్పుడో ఆగిన సినిమా ఇప్పుడు సెట్స్ పైకొచ్చింది

ఎప్పుడో ఆగిన సినిమా ఇప్పుడు సెట్స్ పైకొచ్చింది

హ్యాపీ బర్త్ డే.. ఇది ఓటీటీ సినిమా కాదంట

హ్యాపీ బర్త్ డే.. ఇది ఓటీటీ సినిమా కాదంట

రాశి ఖన్నాకు మారుతి ట్రైనింగ్ ఇచ్చాడంట

రాశి ఖన్నాకు మారుతి ట్రైనింగ్ ఇచ్చాడంట

పవిత్ర నా భార్య.. నరేష్ ఎవరో నాకు తెలీదు

పవిత్ర నా భార్య.. నరేష్ ఎవరో నాకు తెలీదు

దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి... మీనా

దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి… మీనా

anasuya feture image

అనసూయ ప్లేస్ లో హాట్ యాంకర్? జబర్దస్త్ ఇక మామూలుగా ఉండదు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)