• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » వెయ్యి ఎకరాల కబ్జా.. మంత్రి పనేనా?

వెయ్యి ఎకరాల కబ్జా.. మంత్రి పనేనా?

Last Updated: June 27, 2022 at 3:39 pm

– బొమ్మరాస్ పేట్ రైతుల అవస్థలు
– కలెక్టరేట్‌ ముందు ధర్నా
– ధరణి వచ్చాక భూములు కోల్పోయామంటూ ఆవేదన
– కబ్జాదారుల వెనుక మంత్రి ఉన్నారని ఆరోపణ

మేడ్చల్‌ కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శామీర్ పేట్ మండల పరిధిలోని బొమ్మరాస్ పేట్ గ్రామానికి చెందిన 200 మంది రైతులు ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గ్రామ పరిధిలో 1050 ఎకరాల భూమిని రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే.. ఈ భూములపై కబ్జాదారుల కన్నుపడిందని అంటున్నారు బాధితులు. నకిలీ పత్రాలతో భూములు కాజేసే కుట్ర చేస్తున్నారని వాపోతున్నారు. 1050 ఎకరాలపై కోర్టులో కేసులు ఉండడంతో సర్వే నెంబర్లను పూర్తిగా బ్లాక్ చేశారు అధికారులు.

రైతులు ఎన్నో ఏళ్లుగా పట్టా పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు కూడా అందుతోంది. అయితే.. ధరణి వీరికి శాపంగా మారింది. నకిలీ డాక్యుమెంట్లతో కోర్టుల్లో కేసులు వేసి తమను కబ్జాదారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు రైతులు. పైగా రెవెన్యూ అధికారులు నకిలీ డాక్యుమెంట్లతో తమ భూములను కబ్జాదారులకు కట్టబెట్టారని చెబుతున్నారు.

అధికారులను సర్వే నెంబర్లను బ్లాక్‌ చేయండంతో రైతున్నలు భూములు అమ్ముకునే వెసులుబాటును కోల్పోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కకపోవడంతో కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ధరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ భూ కబ్జా రూ.1500 కోట్ల కుంభకోణంగా చెబుతున్నారు రైతులు. దీని వెనుక మంత్రి జగదీష్‌ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

Advertisements

Primary Sidebar

తాజా వార్తలు

బూమరాంగ్..తప్పు మీద తప్పు

జాతినుద్దేశించి రాష్ట్రప‌తి తొలి ప్ర‌సంగం!!

బాయ్ కాట్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు!!

సైనికులు తుపాకి ఎక్కడైనా వాడొచ్చా…?

మిలటరీ లేని దేశాలు కూడా ఉన్నాయా…?

ప్ర‌పంచ దేశాల‌కు దిక్సూచిగా భార‌త్‌: కేటీఆర్‌

వేడుక‌ల‌కు ముస్తాబైన ఎర్ర‌కోట‌!!

ఆర్బిఐ వడ్డీ రేట్ లు ఎందుకు పెంచుతుంది…?

నిఖిల్ నమ్మకాన్ని నిజం చేసిన సెంటిమెంట్

లాహోర్‌లో రోడ్డు ప్ర‌మాదం… 13 మంది మృతి!!

కావాలనే కొంత మంది రాజకీయాలు చేస్తున్నారు….!

ఇండియా మ్యాప్ ఆకారంలో మానవహారం… ఆకట్టుకున్న డ్రోన్ వీడియో….!

ఫిల్మ్ నగర్

బాయ్ కాట్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు!!

బాయ్ కాట్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు!!

నిఖిల్ నమ్మకాన్ని నిజం చేసిన సెంటిమెంట్

నిఖిల్ నమ్మకాన్ని నిజం చేసిన సెంటిమెంట్

సెప్టెంబర్ 16న ఆ అమ్మాయి గురించి చెప్తాడంట!

సెప్టెంబర్ 16న ఆ అమ్మాయి గురించి చెప్తాడంట!

ఎఫ్3 సినిమా ఫ్లాప్ అంట.. పరుచూరి చెప్పిన మాటిది

ఎఫ్3 సినిమా ఫ్లాప్ అంట.. పరుచూరి చెప్పిన మాటిది

లైగర్ కోసం మందు మానేశాడంట

లైగర్ కోసం మందు మానేశాడంట

నిఖిల్ కెరీర్ లో టాప్-5 ఓపెనర్స్ ఇవే

నిఖిల్ కెరీర్ లో టాప్-5 ఓపెనర్స్ ఇవే

ఆస్కార్ రేసులో! ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

ఆస్కార్ రేసులో! ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

ర‌జినీ స‌ర‌స‌న త‌మ‌న్నా!!

ర‌జినీ స‌ర‌స‌న త‌మ‌న్నా!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)