కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం రేపిన సమత హత్య కేసుపై ఫాస్ట్ ట్రాక్ లో విచారణ జరగనుంది. నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ ముగ్దుంలను కోర్టు విచారించనుంది. నిందితుల తరపున న్యాయవాది రహీం వాదనలు వినిపించనున్నారు.
లింగాపూర్ మండలం ఎల్లపటార్లో గత నెల 24న సమత హత్యాచారానికి గురైంది. బెలూన్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్న సమత పని ముగించుకుని సాయంత్రం ఒంటరిగా ఇంటికి వెళ్తున్న సమయంలో నిందితులు అడ్డగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సమత గొంతుకోసి హత్య చేశారు. సమత హత్య పై మహిళా సంఘాలు ప్రతిపక్షాలు ఆందోళనలు చెయ్యటంతో సత్వర విచారణకు ఆదిలాబాద్ జిల్లా, అదనపు సెషన్స్ కోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.