పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేవరకు దీక్ష చేస్తానని షర్మిల భీష్మించుకొని కూర్చోవడంతో.. లోటస్ పాండ్ దగ్గర ఆమె దీక్ష కొనసాగుతుంది. పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె నిన్న మధ్యాహ్నం నుంచి ఆమరణ దీక్షను చేపట్టారు.
దీంతో పోలీసులు లోటస్ పాండ్ లోపలికి కార్యకర్తలను అనుమతించడం లేదు. కార్యకర్తలను రాకుండా మూడు వైపుల పోలీసులు బారికేడ్లు పెట్టారు. అయితే ప్రభుత్వం తన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఆమె తేల్చి చెబుతున్నారు.
అయితే షర్మిల తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని..అయినా ఎవరికి భయపడేది లేదన్నారు. కేసీఆర్ కు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ గా పని చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు బలవంతంగా ఆమె ఇంటి బయట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి తీసుకొని వెళ్లారు. తన ఇంటి దగ్గర తాను దీక్ష చేపడితే ఇన్ని ఆంక్షలా..? అని ఆమె పోలీసులపై మండిపడ్డారు.
రోడ్డుపై బైఠాయించిన షర్మిల దగ్గరికి ఆమె తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లడానికి ప్రయత్నించగా ముందుగా అడ్డుకున్న పోలీసులు తరువాత అనుమతించారు. అయితే తన దీక్షను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని షర్మిల ఆరోపించారు.