కరోనా చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని హైదరాబాద్ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూప్ తయారు చేసింది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్ను అత్యంత ధరకు మార్కెట్ లోకి తీసుకరాబోతుంది. ఈ ట్యాబ్లెట్ ఒక్కో ధర 33 రూపాయలుగా నిర్ణయించింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్, ఫార్ములేషన్ను సొంత పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో రూపొందించామని ఎంఎస్ఎన్ గ్రూప్ ప్రకటించింది. ఇప్పటికే ఈ కంపెనీ నుండి కరోనా చికిత్సకు ఓసెల్టామివిర్ 75 ఎంజీ క్యాప్సూల్స్ను విడుదలైంది.
తక్కువ ధరలో అందుబాటులోకి రాబోతున్న ఈ ఫావిలో 400 ఎంజీ ట్యాబ్లెట్ను త్వరలో అందుబాటులోకి తీసుకరాబోతున్నారు. డిమాండ్ కు సరపడ ఫావిలో సరఫరా చేయగలిగే సామర్థ్యం కంపెనీకి ఉందని కంపెనీ ప్రకటించింది.