ఇండియన్ ఎయిర్ఫోర్స్ చరిత్రలోనే ఓ సంచలనం. భారత వాయుసేనల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిన సందర్భం. యుద్ధ విమానాలను జాతీయ రహదారిపై ల్యాండింగ్ చేసి కొత్త అధ్యాయాన్ని నెలకొల్పింది మన వైమానిక దళం. రాజస్థాన్ జలోర్లో పాకిస్థాన్ సరిహద్దుకు సమీపం నుంచి వెళ్లే 925వ జాతీయ రహదారిపై యుద్ధ విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంలో సఫలమైంది.
#WATCH | C-130J Super Hercules transport aircraft with Defence Minister Rajnath Singh, Road Transport Minister Nitin Gadkari & Air Chief Marshal RKS Bhadauria onboard lands at Emergency Field Landing at the National Highway in Jalore, Rajasthan pic.twitter.com/BmOKmqyC5u
— ANI (@ANI) September 9, 2021
Advertisements
యుద్ధ సమయాల్లో లేదా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసరంగా యుద్ధ విమానాలను ల్యాడింగ్ చేసే ఉద్దేశ్యంతో కేంద్రం 12 రాష్ట్రాల్లో వివిధ హైవేలపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ స్ట్రిప్స్ను నిర్మిస్తోంది. ఈ క్రమంలో 925 హైవేపై నిర్మాణం పూర్తయిన ల్యాండింగ్ ఫీల్డ్ స్ట్రీప్పై సి-130జే, సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ యుద్ధ విమానాలను ప్రయోగాత్మకంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది వైమానిక దళం. సి-130జేలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ భదౌరియా ప్రయాణించారు.
ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ సరిహద్దులోని రోడ్డుపై ల్యాండింగ్ చేసి.. సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనే సందేశం పంపినట్టయిందని వారు అభిప్రాయపడ్డారు.