సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా కరీమాబాద్లోని రామ్ లక్ష్మణ్ గార్డెన్లో పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు చేశారు. కేక్ కట్ చేస్తుండగా క్యాండిల్ ఒక్కసారిగా పేలింది. ఆ మంటలు పేపర్లకు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
మంటలు ఎగిసి పడటంతో అప్రమత్తమైన నేతలు మంటలను ఆర్పి వేశారు. సంఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే నరేందర్, ప్రజాప్రతినిధులు అక్కడే ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.