మళ్లీ సిలిండర్ ధర పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచిన సర్కార్ కమర్షియల్ సిండర్ పై ఏకంగా 350 రూపాయలు పెంచేసింది. దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచే ఈ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చేశాయి. 14.2 కిలోల డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరగడంతో.. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర 1,130 కి చేరింది.
ఇక హైదరాబాద్ లో అదే సిలిండర్ ధర 1,155 కి పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులను బట్టి ఈ రేట్లు మారతూ ఉంటాయి.మరో వైపు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సలిండర్ ధర 350 పెరుగుదలతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర 2119.50 కు చేరింది. చమురు సంస్థలు వడ్డించిన ఈ కొత్త రేట్లతో జనం పై మరోసారి భారం పడింది.
ఇక దేశీయ వంట గ్యాస్ ధరలు స్థానిక పన్నుల కారణంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీ ధరలకు అందజేస్తున్నారు. అంతకు మించి వినియోగిస్తే సదరు వినియోగదారులు మార్కెట్ ధరలో ఎల్పీజీ సిలిండర్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.