హైదరాబాద్ నగరంలోని బహదూర్పుర పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మీర్ ఆలం పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్యారేజ్ లో నిలిపి ఉన్న ప్రైవేట్ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.
వాటిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా సమయంలో అక్కడా ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
అయితే.. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.