• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

కరోనాపై తొలి మరణం- కేసును తిప్పి పంపిన హైదరాబాద్ ఆసుపత్రులు

Published on : March 13, 2020 at 11:10 am

భారత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని 75 సంవత్సరాల వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందటం ఇప్పుడు ఆందోళన రేకేత్తిస్తోంది. అయితే… ఈ కేసులో హైదరాబాద్‌లోని బడా ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం ఉన్నట్లు ఆరోపణలొస్తున్నాయి.

కర్ణాటక రాష్ట్రంలోని కల్‌బుర్గి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ బడా కార్పోరేట్‌ ఆసుపత్రికి తరలించగా… అతనికి కరోనా లక్షణాలుండటంతో గాంధీకి తరలించాలని సూచించారు. దీంతో అతని బంధువులు గాంధీకి కాకుండా మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అక్కడ కరోనా లక్షణాలున్న వ్యక్తి బంధువుకు డాక్టర్‌ పరిచయం ఉండటంతో… అక్కడ చేర్పించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా కరోనా అనుమానంతో చికిత్స చేయకపోవటంతో… బంజరాహిల్స్‌లోని గుండె సంబంధిత చికిత్సలకు ఫేమస్ అయిన ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చెస్ట్ ఎక్స్‌రే పరిశీలించిన వైద్యులు… ఉపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉందని, చనిపోయే ప్రమాదం ఉందని గ్రహించి అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారు.

దీంతో అతన్ని తిరిగి కర్ణాటకకు తరలించగా… అక్కడే అతను చనిపోయాడు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు కూడా కరోనా చికిత్స అందిస్తాయని ముందుకు వచ్చాయంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న పరిస్థితి లేదని అర్థమవుతోంది.

అయితే అతను కరోనా వ్యాధితో చనిపోయాడని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి.రాములు దృవీకరించారు.

The 76 year old man from Kalburgi who passed away & was a suspected #COVID19 patient has been Confirmed for #COVID19. The necessary contact tracing, isolation & other measures as per protocol are being carried out.

— B Sriramulu (@sriramulubjp) March 12, 2020

tolivelugu app download

Filed Under: అవీ ఇవీ..., బిగ్ స్టోరీ, వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

మ‌రోసారి వివాదాల్లో సైఫ్ అలీఖాన్

మ‌రోసారి వివాదాల్లో సైఫ్ అలీఖాన్

చైతూ ఫోటోకు స‌మంతా కామెంట్- వైర‌ల్

చైతూ ఫోటోకు స‌మంతా కామెంట్- వైర‌ల్

మ‌రో మూవీకి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్

మ‌రో మూవీకి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్

బాక్స‌ర్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చేశాడోయ్

బాక్స‌ర్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చేశాడోయ్

ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్...బాలయ్య

ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్…బాలయ్య

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

భారతీయం.. బైడెన్ బృందంలో 20 మంది ఇండియ‌న్ అమెరిక‌న్లు

భారతీయం.. బైడెన్ బృందంలో 20 మంది ఇండియ‌న్ అమెరిక‌న్లు

రైతులను మోసం చెయ్యటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ

రైతులను మోసం చెయ్యటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ

ఆసీస్ తో టెస్ట్- అద్భుత ఫీట్ సాధించిన హైద‌రాబాదీ బౌల‌ర్

ఆసీస్ తో టెస్ట్- అద్భుత ఫీట్ సాధించిన హైద‌రాబాదీ బౌల‌ర్

ఎన్నిక‌ల ముందు ఖ‌మ్మం టీఆర్ఎస్ లో పొంగులేటి అస‌మ్మ‌తి రాగం

ఎన్నిక‌ల ముందు ఖ‌మ్మం టీఆర్ఎస్ లో పొంగులేటి అస‌మ్మ‌తి రాగం

అశోక్ గ‌జ‌ప‌తిరాజున మ‌ళ్లీ టార్గెట్ చేసిన సంచ‌యిత‌

అశోక్ గ‌జ‌ప‌తిరాజున మ‌ళ్లీ టార్గెట్ చేసిన సంచ‌యిత‌

రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీపై సుప్రీం విచార‌ణ‌

రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీపై సుప్రీం విచార‌ణ‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)