• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి ప్రమాణం..!

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి ప్రమాణం..!

Last Updated: February 6, 2023 at 3:17 pm

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి పులిగోరు వెంకట సంజయ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. గతంలో ఆయన మణిపూర్ హైకోర్టు సీజేఐగా పని చేశారు. గతేడాది డిసెంబర్ 13న సీజేఐ నేతృత్వంలోని కొలీజియం జస్టిస్ సంజయ్ తో పాటు మరో నలుగురిి పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది.

గతనెల 31న మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసింది. మొదట పంపిన జాబితాలో న్యాయమూర్తుల నియామక ప్రకటనను ముందుగా విడుదల చేయాల్సిన విషయాన్ని కేంద్రానికి కొలీజియం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే వీరి నియామకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది.

జస్టిస్ సంజయ్‌తో పాటు మరో నలుగురు న్యాయమూర్తులు కూడా ప్రమాణం చేశారు. న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లా, మనోజ్ మిశ్రాలు ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. తాజాగా వీరి రాకతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. ఇంకా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ గతంలో మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ తర్వాత సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనంపై కూర్చున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్‌.

ఆయన తండ్రి పీ.రామచంద్రారెడ్డిది చిత్తూరు జిల్లా. జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ 1963 ఆగస్టు 14న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన హైదరాబాద్‌ నిజాం కాలేజీలో డిగ్రీని పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం చదివారు.

1988లో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆయన ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశారు. ఆ తర్వాత 2008 ఆగస్టు 8న అక్కడే అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్‌ 14న పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 12న మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

 

Primary Sidebar

తాజా వార్తలు

నా దగ్గరున్న ఆధారాలు సిట్ కు ఇచ్చేది లేదు!

మరోసారి తెరమీదకు  మంచు బ్రదర్స్‌ గొడవ!

హస్తినలో పోస్టర్ల హల్ చల్!

మరో బాంబు పేల్చిన హిండెన్ బెర్గ్ .. జాక్ డోర్సే టార్గెట్ !

మెగాస్టార్‌ తో అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ !

నిందితుని కోసం ఆపరేషన్..ఇంతలో!

టెన్త్ హాల్ టికెట్స్ వైబ్ సైట్లో..ఆర్టీసీ గుడ్ న్యూస్!

రేవంత్ ఇంటి దగ్గర ఉద్రిక్తత!

చింతకాయల కోసం తమ్ముడిని కత్తితో పొడిచిన అన్న!

‘మీరా మాకు పాఠాలు నేర్పేది ?’ పాక్ పై ఇండియా ఫైర్

కలలో కృష్ణుడు దర్శనమిచ్చాడు: తేజ్‌ ప్రతాప్‌!

ఉస్మానియా క్యాంపస్ లో టెన్షన్.. టెన్షన్! హై అలర్ట్!

ఫిల్మ్ నగర్

manchu manoj slams brothe vishnu behaviour

మరోసారి తెరమీదకు  మంచు బ్రదర్స్‌ గొడవ!

chiranjeevi next movie with director sandeep reddy vanga

మెగాస్టార్‌ తో అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ !

chandrabose grand entry in india oscar award

ఆస్కార్‌ ”చంద్రు”డికి ఘన స్వాగతం!

'పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

‘పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

రంగమార్తాండ బ్రహ్మానందానికి మెగాభినందనలు...!

రంగమార్తాండ బ్రహ్మానందానికి మెగాభినందనలు…!

నువ్వు ‘దసరా’, నేను ‘రావణాసుర’ …  సెల్ఫ్ మేడ్  స్టార్స్ చిట్ చాట్..!

నువ్వు ‘దసరా’, నేను ‘రావణాసుర’ … సెల్ఫ్ మేడ్ స్టార్స్ చిట్ చాట్..!

‘విరూపాక్ష’ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్...!

‘విరూపాక్ష’ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్…!

ఆహారంలో కోతులు నాకు ఆదర్శం అంటున్న అదాశర్మ..!

ఆహారంలో కోతులు నాకు ఆదర్శం అంటున్న అదాశర్మ..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap