కేరళలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిరిండియా విమానం(IX-1344) ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి 7.40 గంటలకు కోజికోడ్లోని కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి రన్వేపై క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలు అయింది. అదే సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో విమానం ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో పైలట్తో పాటు విమాన ప్రమాదంలో మొత్తం 14 మంది మృతి చెందగా 123 మందికి గాయాలపాలయ్యారు. 15 మంది పరిస్తితి విషమంగా ఉంది. 24 అంబులెన్స్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. జిల్లా విపత్తు నిర్వహణ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కేరళలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎయిర్పోర్టులో భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.