రాజేంద్రనగర్లో ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ఇంకా చిక్కలేదు. ఆవులు, లేగదూడలపై దాడి చేస్తున్న చిరుతను పట్టుకునేందుకు జిల్లా అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజేంద్రనగర్ వాలంతరి సమీపంలోని ఫాతీమా ఫాం హౌజ్ పశువుల కొట్టంలో చిరుతను పసిగట్టేందుకు 20 ట్రాప్ కెమరాలను అధికారులు ఏర్పాటు చేశారు. చిరుత సంచారం కెమరాలో రికార్డ్ అయితే మూడు బోన్లను ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆవు పై దాడి చేసింది చిరతనేని అధికారులు నిర్ధారించారు. మూడు నెలల క్రితం రెండు ఆవులను చిరుత చంపగా, అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను అధికారుల జూ కు తరలించారు.