భారతదేశంలో జరిగే అభివృద్ధిపై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కుల వివక్షను చట్ట విరుద్ధంగా ప్రకటించిన తొలి అగ్రరాజ్య నగరంగా సియాటెల్ నిలిచింది. ఈ విషయమై ఆకునూరి మురళి ఆదివారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
భారతదేశ అభివృద్ధిపై విమర్శలు చేశారు. భారతదేశం ఎదగడానికి, అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అతి పెద్ద అడ్డంకుల్లో ఒకటి ‘కులం వైరస్’ అని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం మీద భారతదేశానికే ఈ ప్రత్యేకమైన వైరస్ ఉందని ఎద్దేవా చేశారు. దీని కారణంగా ప్రపంచంలో భారతదేశం తన విశ్వసనీయతను కోల్పోతుందన్నారు.
అయితే మాజీ ఐఏఎస్ మురళి ట్వీట్ పై నెటిజన్లు విభిన్న రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మీ వ్యాఖ్యలను నిరూపించగలరా అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు కుల ఆధారిత రిజర్వేషన్లు భారతదేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.