• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » ఇప్పుడు బూర‌… నెక్ట్స్ ఎవ‌రు??

ఇప్పుడు బూర‌… నెక్ట్స్ ఎవ‌రు??

Last Updated: October 15, 2022 at 11:03 am

తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్ నిర్ణ‌యించ‌బోయే మునుగోడు ఉప ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌బోతున్న త‌రుణంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్ది సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసిన రోజే అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది.

పార్టీ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి.. బీజేపీలో రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. నిన్న‌ ఉదయమే ఢిల్లీకి వెళ్లిన బూర.. బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నిక టికెట్ ఆశించిన బూర.. కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. అయితే కూసుకుంట్లను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రగతి భవన్ లో బూరతో మాట్లాడి బుజ్జగించారు సీఎం కేసీఆర్. తర్వాత మీడియాతో మాట్లాడిన బూర.. కేసీఆర్ ఏం చేసినా పార్టీ ప్రయోజనాల కోసమేనని చెప్పారు.

కూసుకుంట్లను మంచి మెజార్టీతో గెలిపిస్తామన్నారు. నిన్న‌ జరిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు బూర. మంత్రి కేటీఆర్ తో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో అంతా సెట్ అయిందని భావించారు. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసిన కొన్ని గంటల్లోనే సీన్ మారిపోయింది. కేటీఆర్ తో కలిసి చండూరు వెళ్లిన బూర.. హైదరాబాద్ తిరిగి రాగానే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

ఆ వెంటనే కొందరు తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడం వెనుక శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. బీజేపీ పెద్దలతో మాట్లాడి బూరకు స్పష్టమైన హామీ ఇప్పించారని సమాచారం.తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ జేఏసీ చైర్మెన్ గా కీలకంగా వ్యవహించారు బూర నర్సయ్య గౌడ్.

2014లో భువనగిరి ఎంపీగా బూరను కేసీఆర్ బరిలోకి దింపారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సంచలన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని భావించారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి ఆయన్ను దూరంగా పెడుతూ వచ్చారు. గత రెండు నెలలుగా మునుగోడులోనే మకాం వేసిన మంత్రి.. బూరను అవమానించేలా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి.

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు బూరను ఆహ్వానం అందలేదు.మండలాల వారీగా నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు పిలవలేదు. దీంతో మంత్రి తనను కావాలనే అవమానిస్తున్నారని బూర తీవ్ర ఆవేదనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అనుచరుల నుంచి వచ్చిన ఒత్తిడితో.. గౌరవం లేని చోట మనసు చంపుకుని ఉండలేక బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. బూర నర్సయ్య గౌడ్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ బీసీ నేతలు కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.

ఇప్పటికే తన అనుచరులతో బూర మంతనాలు సాగించారని అంటున్నారు. కొందరు బీసీ నేతలు బూరకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లారని కూడా తెలుస్తోంది. బూర బీజేపీలో చేరిన తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ఆ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయంటున్నారు. మరోవైపు మునుగోడు టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

ఆయన కూడా మంత్రి జగదీశ్ రెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. అయితే కర్నె అనుచరులు మాత్రం ఆయన పార్టీ మారే అవకాశం లేదని చెబుతున్నారు. మునుగోడు టికెట్ ఆశించిన నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ తోనూ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది.

Primary Sidebar

తాజా వార్తలు

జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..!

తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్

లాస్ట్ 15 మినిట్స్ లోనే బిట్ పేపర్.. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పై కీలక నిర్ణయాలు!

అందరూ రేవంత్ వెంటే నడవాలి..అప్పుడే!

పడగ విప్పుతున్న కరోనా…!

ముఖ్యమంత్రికి మూడింది.. బండి సంచలన ప్రకటన!

కేటీఆర్ ను విచారించాలి.. గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు!

ఇంటర్ విద్యార్థిని ప్రాణం మింగిన నల్లా నీళ్ల పంచాయితీ!

బిల్కిస్ కేసు.. విచారణకు ‘సుప్రీం’ అంగీకారం

నక్షత్ర గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది..!

ఓటర్ తో ఆధార్ లింక్.. కేంద్రం కీలక నిర్ణయం

టీఎస్పీఎస్సీ లీక్ కేసులో ట్విస్ట్.. మరో ఉద్యోగి హస్తం!!

ఫిల్మ్ నగర్

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap