తిరుపతి: చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం క్రితం ఆస్పత్రిలో చేరిన శివప్రసాద్ను కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చెన్నై అపోలో చికిత్స పొందుతున్న శివప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది.