• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » ప్రొఫెషనల్స్‌ ఇలా చేయరు..!!

ప్రొఫెషనల్స్‌ ఇలా చేయరు..!!

Last Updated: January 6, 2023 at 12:34 pm

శ్రీలంకతో టీ20 సిరీస్‌ను టీమిండియా పుణెలోనే సొంతం చేసుకుంటుందని ఆశించిన ఫ్యాన్స్‌ను నిరాశే ఎదురైంది. అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లలో విఫలమైన టీమ్‌.. 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. అక్షర్‌ పటేల్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది.

అయితే మొదట బౌలింగ్‌లో ఇండియన్‌ టీమ్‌ భారీగా పరుగులు సమర్పించుకుంది. దీనికితోడు వరుస నోబాల్స్‌ అటు కెప్టెన్‌ హార్దిక్‌ను ఇటు ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా ఇన్నింగ్స్‌ రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ వరుసగా మూడు నోబాల్స్‌ వేయడం షాక్‌కు గురి చేసింది. ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్‌లో ఏ ఇతర ఇండియన్ బౌలర్‌ వరుసగా మూడు నోబాల్స్‌ వేయలేదు.

నోబాల్ వేయడం ఓ క్రైమ్‌ అంటూ దీనిపై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కూడా అసంతృప్తి వ్యక్తం చేయగా.. మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ కూడా అర్ష్‌దీప్‌, శివమ్‌ మావి నోబాల్స్‌పై సీరియస్‌ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కామెంట్రీ చేసిన సన్నీ.. ఆ సమయంలోనే తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రొఫెషనల్స్‌ ఇలా చేయరంటూ ఘాటుగా స్పందించాడు.

“ఓ ప్రొఫెషనల్‌గా మీరు ఇలా చేయకూడదు. ఈ మధ్య కాలంలో ప్లేయర్స్‌ తరచూ పరిస్థితులు తమ నియంత్రణలో లేవని చెప్పడం వింటూ ఉన్నాం. కానీ నోబాల్‌ వేయకపోవడం అన్నది మీ నియంత్రణలోనే ఉంటుంది. మీరు బాల్‌ వేసిన తర్వాత ఏం జరుగుతుంది, బ్యాట్స్‌మన్‌ ఏం చేస్తాడన్నది వేరే విషయం. కానీ నోబాల్‌ వేయకపోవడం కచ్చితంగా మీ నియంత్రణలోనే ఉంటుంది” అని గవాస్కర్‌ స్పష్టం చేశాడు.

టీ20ల్లో హ్యాట్రిక్‌ నోబాల్స్‌ వేసిన తొలి ఇండియన్‌ బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్న అర్ష్‌దీప్.. తాను వేసిన తొలి ఓవర్లోనే 19 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో శ్రీలంక భారీ స్కోరుకు బాటలు వేసినట్లయింది. ఈ మ్యాచ్‌లో 206 రన్స్‌ చేసిన శ్రీలంక.. తర్వాత ఇండియాను 190 రన్స్‌ స్కోరుకు కట్టడి చేసింది.

Primary Sidebar

తాజా వార్తలు

శ్రీకాకుళంలో వింత డ్రోన్‌ కలకలం!

నగరానికి చేరుకున్న యువ క్రికెటర్లు!

రంగంలోకి దిగిన ఆర్బీఐ.. స్థానిక బ్యాంకులతో టచ్ !

నగ ఎత్తుకెళ్ళిన నాటీ ఎలుక…!

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు..మెమోలిచ్చిన ఈవో!

పార్లమెంటును తాకిన ‘అదానీ సెగ’.. మధ్యాహ్నం వరకు వాయిదా

ఫిల్మ్ నగర్

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి... !!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి… !!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap