గీతారెడ్డి, మాజీ మంత్రి
తెలంగాణలో అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉంది. మైనర్ బాలిక అత్యాచార కేసు రోజురోజుకీ విచిత్రంగా మారుతోంది. రాజకీయ నాయకుల పిల్లలని కాపాడాలని పోలీసులు చూస్తున్నారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేసినా ఎందుకు మూడు రోజుల వరకు పట్టించుకోలేదు. పబ్స్ కి,డ్రగ్స్ కి హైదరాబాద్ హబ్ గా మారింది. అసలు పబ్స్ కి పర్మిషన్స్ ఉన్నాయా?
2014లో మద్యంతో 10 వేల కోట్ల ఆదాయం ఉంటే.. ఇప్పుడు 34 వేల కోట్లు వస్తోంది. మైనర్ అత్యాచార కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉంది. నిందుతుడు దుబాయ్ వెళ్లాడు. ఎవరినో కాపాడటానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రయత్నిస్తున్నారు. అమ్మాయి వీడియో రిలీజ్ చేసి బాధిత కుటుంబం బయట తిరగకుండా చేశారు.
ఒక న్యాయవాదిగా పనిచేసిన రఘనందన్ రావుకి ఆడ బిడ్డలు లేరా? ఆయనపై కూడా కేసు పెట్టాలి. చర్యలు తీసుకోవాలి. న్యాయవాది వామనరావు దంపతులని రోడ్డుపై నరికి చంపేస్తే చర్యలు లేవు. మేము ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు హౌస్ అరెస్టులు చేయడానికే ఉన్నారా? నిందితులని పట్టుకోవడానికి పని చేయరా?
ఎంఐఎం నాయకులతో రఘునందన్ రావుకి పరిచయాలు ఉన్నాయి. టీఆర్ఎస్ , బీజేపీ ఒక్కటయ్యాయి. రాష్ట్రం ఊడ్తా తెలంగాణగా మారింది.