హైదరాబాద్ లోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గచ్చిబౌలిలో అక్రమంగా వెలిసిన గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు.
పోలీసు భద్రత మధ్య జీపీఆర్ఏ క్వార్టర్స్ వద్ద రోడ్డుకు ఇరువైపుల ఉన్న గుడిసెలను అధికారులు కూల్చివేయిస్తున్నారు. సుమారు 50 గుడిసెలను జీహెచ్ఎంసీ తొలగిస్తున్నారు.
గుడిసెల కూల్చివేతను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన ఇళ్లు ఖాళీ చేయలేదని అధికారులు తెలిపారు.
కోర్టు ఆదేశల మేరకు కూల్చివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.