విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొని రావడానికి తెలంగాణ సర్కార్ విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ చేస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలోని 26 వేల పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2 వేల మంది విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఒక్కో ట్యాబ్ విలువ 86 వేలు ఉంటుందన్న ఆయన.. విద్యార్థులకు పోటీ పరీక్షల సమయంలో దీని ఉపయోగం ఎంతగానో ఉంటుందన్నారు.
ఎల్లారెడ్డి పేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలోని పాఠశాలలను రాష్ట్రంలో భిన్నంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలోనే సిరిసిల్ల జిల్లాకు స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో గ్రామీణ అవార్డు వచ్చిందని చెప్పారు. ఇక వేములవాడ నియోజకవర్గంలో కూడా 3 వేల ట్యాబ్ లు అందజేస్తామని ఆయన తెలిపారు.