పాటిదార్ సామాజిక నేత , గుజరాత్ కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన ఓ ట్వీట్ చేశారు.
దేశ, రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నట్టు ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.
ప్రజల, సామాజిక ప్రయోజనాలే తన ప్రధాన ఎజెండా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర భాయ్ మోడీ నాయకత్వంలో దేశ సేవలో తాను చిన్న సైనికుడిగా పనిచేస్తానని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ లో అంతర్గత విభేదాల నేపథ్యంలో హార్ధిక్ పటేల్ మే 18న పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ వార్తలను కన్ఫార్మ్ చేస్తూ ఆయన బీజేపీలో చేరుతున్నారు.