హైదరాబాద్ నారాయణగూడలో భారీ బంగారు చోరీ జరిగింది. ఆభరణాలు తయారు చేయమని బంగారం ఇస్తే దానితో ఉడాయించాడు ఓ స్వర్ణకారుడు. స్థానికంగా నగలు తయారీ షాపు పెట్టుకుని ఉంటున్న గోల్డ్ స్మిత్ గణేష్ చంద్ర దాస్..దాదాపు కోటి రూపాయల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు.
దీంతో నగల యజమానే స్వయంగా దొంగకు బంగారం ఇచ్చినట్టైంది. అందిన సమాచారం ప్రకారం.. బషీర్బాగ్లోని శ్రీయాష్ జ్యూవెల్లర్స్ యజమాని ఆనంద్ కుమార్..కోటి రూపాయల విలువ చేసే బంగారాన్ని ఆభరణాల తయారీకి గోల్డ్ స్మిత్ గణేష్ చంద్ర దాస్కు ఇచ్చాడు.
ఆభరణాల తయారీ కోసం బంగారం తీసుకున్న గణేష్ చంద్ర దాస్.. తిరిగి ఇవ్వలేదు.దీంతో ఆభరణాలు తయారు చేసే గణేష్ చంద్ర దాస్ షాపునకు వెళ్లి చూడగా పరారీలో ఉన్నాడు. దీంతో బాధిత యజమాని నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమ్మి బంగారం ఇస్తే ఇంత మోసానికి పాల్పడ్డాడని జ్యువెల్లర్స్ యజమాని ఆనంద్ కుమార్ పోలీసుల ఎదుట వాపోయారు.