బంగారం…చట్టం ఆమోదించిన మార్గంలో సొంతం చేసుకుంటే అది హోదాకి సింబల్. చట్టవిరుద్ధమైన పద్ధతిలో సొంతం చేసుకుంటే అది నేరం. అయితే సక్రమ మార్గంలో వచ్చే బంగారం కన్నా అక్రమంగా తరలించే బంగారమే ఎక్కువని లెక్కలు లెక్కలు చెబుతున్నాయి.
ఇప్పటికే పలువురు బ్యాగుల్లో, దుస్తుల్లో దాచుకొని బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. తాజాగా ఓ వ్యక్తి చెప్పుల్లో దాచి తరలిస్తుండగా..స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే..బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో ఓ వ్యక్తి బెంగళూరు చేరుకున్నాడు. సదరు వ్యక్తి నుంచి 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి చెప్పుల్లో దాచి తరలిస్తుండగా.. పట్టుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.69.40లక్షల వరకు ఉంటుంది కస్టమ్స్ అధికారులు తెలిపారు.
సదరు వ్యక్తి బంగారం తరలించిన తీరు విస్మయానికి గురి చేసిందని అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అధికారులు చెప్పుల నుంచి బంగారం తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH | Gold weighing 1.2 kg worth Rs 69.40 lakh seized from a slipper of a passenger who arrived from Bangkok in Bengaluru by IndiGo flight: Customs pic.twitter.com/4dBwb5Dhpv
— ANI (@ANI) March 15, 2023