ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జిల్లా పై ముఖ్యమంత్రి వరాల జల్లులు కురిపించిన విషయం తెలిసిందే. చెప్పిన ప్రకారమే.. మరుసటి రోజే జిల్లాలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి నాంది పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫు నుంచి రూ.180 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు జీవో విడుదల చేసింది.
బుధవారం జరిగిన సభలో సీఎం… ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. పెద్ద తండా, కల్లూరు, ఏదులాపురం, కల్లాల, నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి అజయ్ వినతి మేరకు మునేరు నది పై కొత్త బ్రిడ్జి, ఖమ్మం లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అంతేకాకుండా ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు నెలరోజుల్లోపు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు.