• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ప్రీతి మరణంపై సమగ్ర విచారణ జరిపించండి: గవర్నర్‌!

ప్రీతి మరణంపై సమగ్ర విచారణ జరిపించండి: గవర్నర్‌!

Last Updated: February 28, 2023 at 3:56 pm

మెడికో ప్రీతి మృతిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ గా స్పందించారు. ప్రీతి మరణంపై నిజనిర్ధారణకు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలని కాళోజీ మెడికల్ యూనివర్శిటీ వీసీని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు రాజ్ భవన్ అధికారులు మంగళవారం నాడు లేఖ రాశారు. మెడికో ప్రీతి మరణం భయంకరమైందిగా ఆ లేఖలో రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ విషయమై వాస్తవాలు తెలుసుకోవడానికి అన్ని కోణాల నుండి విచారణ అవసరమని రాజ్ భవన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాళోజీ యూనివర్శిటీలో ర్యాగింగ్, వేధింపుల తరహ ఘటనలపై గవర్నర్ తమిళిసై నివేదిక కోరారు. మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనివేళలు , మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పనితీరు అంశాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించాయి రాజ్ భవన్ వర్గాలు.

ప్రీతిని నిమ్స్ కు తరలించడంతో కీలకమైన సమయం కోల్పోయినట్టుగా రాజ్ భవన్ వర్గాలు ఆ లేఖలో అభిప్రాయపడ్డాయి. మెడికో ప్రీతిని ఎంజీఎంకు తరలించి మెరుగైన చికిత్స అందించాల్సి ఉండేదని రాజ్ భవన్ అభిప్రాయపడింది. గ్రీవెన్స్ సెల్ పనితీరు, బాధితుల సమస్యలను పరిష్కరించడం, మెడికోల ఫీడ్ బ్యాక్ వంటి అంశాల గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించింది రాజ్ భవన్.ర్యాగింగ్ నిరోధక చర్యలు, యూనివర్శిటీ వీసీ నియంత్రణలో ఉన్న యంత్రాంగంపై నివేదిక ఇవ్వాలని లేఖలో కోరారు. ర్యాగింగ్ నిరోధక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని రాజ్ భవన్ ఆ లేఖలో సూచించింది.

ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని బలోపేతం చేయాలని కోరాయి రాజ్ భవన్ వర్గాలు.సైకియాట్రీ విభాగానికి చెందిన హెచ్ఓడీ నేతృత్వంలో విద్యార్ధి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాజ్ భవన్ ఆదేశించింది. ఈ మేరకు వ్యూహలను రూపొందించాలని కూడా రాజ్ భవన్ వర్గాలు ఆ లేఖలో వీసీని ఆదేశించాయి.

Primary Sidebar

తాజా వార్తలు

న్యూలుక్ లో హీరో నితిన్ … బీష్మ కాంబో రిపీట్ ….!

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

రేవంత్ రెడ్డి బాగా మాట్లాడతారు.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

అదానీ అంశంపై జేపీసీ వేయాల్సిందే.. కాంగ్రెస్

కేటీఆర్, బండి సంజయ్ ల ఉగాది పంచాంగం..!

భద్రాద్రి బ్రహ్మోత్సవాలు.. కేసీఆర్, గవర్నర్ లకు ఆహ్వానం

భారంగా మారిన వైద్యు ఖర్చులు.. యువకుడి బలవన్మరణం..!

పేపర్ల లీకేజీ కేసులో 42 మందికి సిట్ నోటీసులు

ఈడీ విచారణ తర్వాత.. కవిత కౌంటర్ వీడియో!

కొడుకు పెళ్ళి కోసం యజమాని ఇంటికి కన్నం…!

గురుద్వారాలో చొరబడి.. అమృత్ పాల్ ‘విలనిజం’ !

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ సంచలన నిర్ణయం

ఫిల్మ్ నగర్

న్యూలుక్ లో హీరో నితిన్ … బీష్మ కాంబో రిపీట్ ....!

న్యూలుక్ లో హీరో నితిన్ … బీష్మ కాంబో రిపీట్ ….!

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన తార

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap