నిన్న జరిగిన డెంటల్ డాక్టర్ వైశాలి కిడ్నాప్ విషయం పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. ఈ విషయం గురించి తీవ్ర ఆందోళనకి గురయ్యానంటూ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని గూండాల నుంచి యువతికి ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు భద్రత కల్పించాలని గవర్నర్ ఆదేశించారు.
అటు ఇబ్రహీంపట్నం ఎంఎల్ ఏ మంచి రెడ్డి కిషన్ రెడ్డి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన గురించి బాధితురాలి తండ్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
Shocked to see the incidence.Concerned about the safety of the women kidnapped Assure her family that the culprits will booked as per law.Request @TelanganaDGP for necessary action to safeguard the family & girl https://t.co/VziafBZQud
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 9, 2022