• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » గవర్నర్లు ఎక్కువ మాట్లాడుతారు… తక్కువ వింటున్నారు…!

గవర్నర్లు ఎక్కువ మాట్లాడుతారు… తక్కువ వింటున్నారు…!

Last Updated: March 9, 2023 at 5:58 pm

గవర్నర్ వ్యవస్థపై తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గవర్నర్లు సాధారణంగా ఎక్కువ మాట్లాడతారని, తక్కువగా వింటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను గవర్నర్లు పాటించాలా? వద్దా? అనే ప్రశ్నకు స్టాలిన్ బదులిచ్చారు.

గవర్నర్లు తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే వారికి కేవలం నోరు మాత్రమే ఉందని, చెవులు లేనట్టు కనిపిస్తోందన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టుపై కూడా ఆయన స్పందించారు. మనీశ్ సిసోడియా అరెస్టును ఆయన ఖండించారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ తమ రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో తాను ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశానని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు బదులు దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై విజయం సాధించాలని ప్రయత్నించ వద్దని ప్రధానికి సూచించినట్టు చెప్పారు.

రాష్ట్రంలో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని వస్తున్న నివేదికలపై ఆయన స్పందించారు. అవన్నీ తప్పుడు నివేదికలన్నారు. దశాబ్దాలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమిళనాడులో నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేదన్నారు. గత కొన్నేళ్లుగా చాలా మంది ఉద్యోగాల కోసం తమిళనాడుకు వచ్చారన్నారు. వారు ఎలాంటి సమస్యలనూ ఎదుర్కోవడంలేదన్నారు. కానీ కొందరు ఫేక్ వీడియోలను ఉపయోగించి అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

గోవాలో డచ్ టూరిస్టుపై దాడి

35 కు చేరిన మెట్ల బావి మృతుల సంఖ్య!

లొంగిపోయే ప్రసక్తే లేదు..అమృత్ పాల్ సింగ్

రిటైర్మెంట్‌ తీసుకునే ఉద్దేశం నాకు లేదు: గడ్కరీ!

బలగానికి మరింత బలమిచ్చిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్…!

నేనొక తెలివిలేని దద్దమ్మని …యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్…!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’…!

భూమి అందాల్ని అద్భుతంగా చిత్రించిన…ఓషన్ శాటిలైట్-3..!

ఆ దొంగలు బంగారం…కాజేసిన బంగారాన్ని రిటర్నిచ్చేసారు…కాకపోతే..!?

బోస్ …ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ….!

మందులపై 12 శాతం ధరలు పెంచడం దారుణం: మంత్రి హరీష్

ఏటీఎంలో కాచుకున్న పాము…ఎంటరైన మహిళకు షాకిచ్చిన స్నేక్…!

ఫిల్మ్ నగర్

బలగానికి  మరింత  బలమిచ్చిన  బెస్ట్ ఫీచర్  ఫిల్మ్ అవార్డ్...!

బలగానికి మరింత బలమిచ్చిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్…!

నేనొక తెలివిలేని దద్దమ్మని ...యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్...!

నేనొక తెలివిలేని దద్దమ్మని …యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్…!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’...!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’…!

బోస్ ...ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ....!

బోస్ …ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ….!

బాలీవుడ్  ‘ఛత్రపతి’గా  బెల్లంకొండ శ్రీనివాస్...దుమ్ములేపుతున్న టీజర్..!

బాలీవుడ్ ‘ఛత్రపతి’గా బెల్లంకొండ శ్రీనివాస్…దుమ్ములేపుతున్న టీజర్..!

వాళ్ల తర్వాత రాహుల్ గాంధీయే.. యాక్టర్ రమ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వాళ్ల తర్వాత రాహుల్ గాంధీయే.. యాక్టర్ రమ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

'బలగం' మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. సర్కార్ ఆపన్న హస్తం

‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. సర్కార్ ఆపన్న హస్తం

g20 delegates in chandigharh dance to oscar winning naatu naatu

నాటునాటు స్టెప్పులేసిన జీ20 ప్రతినిధులు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap