అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్పై ఏపీ సర్కారు నిషేధం విధించింది.
ఆరోగ్యరంగంలో మెరుగుదలకు సుజాత రావు కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం ప్రకటించింది.
కమిటీ 100కుపై సిఫార్సులు చేసింది. సిఫార్సులపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు, నవంబర్ 1 నుంచి ప్రారంభం ఈ సేవలు ప్రారంభమవుతాయి.
డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం. ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు చేర్చారు.
జనవరి 1 నుంచి 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్ ప్రాజక్ట్ ను పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేయనున్నారు.
వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తారు. ఏప్రిల్ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు చేస్తారు. లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపిందించనున్నారు.
ఆపరేషన్ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం అందిస్తారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్ను విస్తరించడంపై చర్చ జరిగింది.
తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి నెలకు రూ.10వేల పెన్షన్ను ఇప్పటికే అమలు చేస్తుండగా ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరీ కిందకు తీసుకు వచ్చి వారికీ నెలకు రూ. 5వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.