• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » అయోధ్యలో శరవేగంగా ఆలయ నిర్మాణం.. ప్రధాని మోడీ

అయోధ్యలో శరవేగంగా ఆలయ నిర్మాణం.. ప్రధాని మోడీ

Last Updated: October 12, 2022 at 9:28 am

దేశంలో హిందూత్వకు ప్రధాని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. హిందూత్వ నినాద ప్రచారం దేశ వ్యాప్తమవుతోంది. ఉజ్జయినిలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దీన్ని నిరూపిస్తున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందని, అలాగే కాశీలో విశ్వనాధ్ ధామ్ భారత సంస్కృతికి ప్రతీకగా మారుతోందని ఆయన అన్నారు. సోమనాథ్, కేదార్ నాథ్, బద్రీ నాథ్ పుణ్యక్షేత్రాల అభివృద్ధి రికార్డు స్థాయిలో జరుగుతోందని ఆయన చెప్పారు. నిన్న ఉజ్జయినిలో శ్రీ మహాకాల్ లోక్ కారిడార్ ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆధ్యాత్మిక ప్రాంతాల శోభను పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ఉజ్జయిని కేవలం భారత భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, ఇది దేశ గడ్డకు కేంద్రం కూడానని ఆయన పేర్కొన్నారు. ప్రతిదీ సూపర్ నేచురల్, అసాధారణం, నమ్మశక్యం కాని వాస్తవం అని మోడీ వ్యాఖ్యానించారు. మహాకాల్ లోక్ కారిడార్ కి సాటి లేదని, దేశ అద్భుత సంస్కృతికి ఇది అద్దం పడుతుందన్నారు.

ఈ సందర్భంగా ఆయన కోణార్క్, మొధేరా, బ్రహ్మ దేవేశ్వర్, శంకరాచార్య ఆలయాల గురించి కూడా ప్రస్తావించారు. మొదటిసారిగా చార్ ధామ్ ప్రాంతాన్ని అన్ని రోడ్లతో కలుపుతున్నట్టు తెలిపారు. చార్ ధామ్ ప్రాజెక్టు కింద నాలుగు ధామ్ లనూ కనెక్ట్ చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మోడీ 2020 ఆగస్టు 5 న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి భక్తులను రామ్ లాలా దర్శనానికి అనుమతించవచ్చునని భావిస్తున్నారు. ఇక్కడ యాత్రికులకు, భక్తులకు అవసరమైన సౌకర్యాల నిమిత్తం చేపడుతున్న భవనాలు, కేంద్రాల నిర్మాణం కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం.. వీటన్నింటికి రూ. 1800 కోట్లు వ్యయం కాగలదని ఈ వర్గాలు వివరించాయి.

Primary Sidebar

తాజా వార్తలు

పడగ విప్పుతున్న కరోనా…!

ముఖ్యమంత్రికి మూడింది.. బండి సంచలన ప్రకటన!

కేటీఆర్ ను విచారించాలి.. గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు!

ఇంటర్ విద్యార్థిని ప్రాణం మింగిన నల్లా నీళ్ల పంచాయితీ!

బిల్కిస్ కేసు.. విచారణకు ‘సుప్రీం’ అంగీకారం

నక్షత్ర గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది..!

ఓటర్ తో ఆధార్ లింక్.. కేంద్రం కీలక నిర్ణయం

టీఎస్పీఎస్సీ లీక్ కేసులో ట్విస్ట్.. మరో ఉద్యోగి హస్తం!!

ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ చేసింది వాళ్ళిద్దరే!

పాలించే రాజుకు వ్యతిరేకత తప్పదు..!

అందరి ప్రాణాలు కాపాడి.. ఆస్పత్రిపాలైన సూపర్ పోలీస్

మోడీపై వివాదాస్పద పోస్టర్ల కలకలం… 100 ఎఫ్ఐఆర్లు నమోదు..!

ఫిల్మ్ నగర్

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap