వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే షర్మిలక పాదయాత్రకు పోలీసులు కండిషన్లతో కూడిన అనుమతి ఇచ్చారు. చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా వద్ద గతేడాది నవంబర్ న షర్మిల అరెస్ట్ తో పాదయాత్ర నిలిచిపోయింది. అయితే ఈ నెల 25న తిరిగి పాదయాత్ర నిర్వహించుకోవాడనికి సీపీకి వైఎస్సార్టీపీ నేతలు దరాఖాస్తు చేశారు.
వచ్చే నెల 2వ తేదీ నుంచి 18 వరకూ పాదయాత్ర నిర్వహించుకోవడానికి సీపీ రంగనాథ్ అనుమతించారు. ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్ర కొనసాగించాలన్నారు. పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాదాస్పద వాఖ్యలు చేయవద్దని కండీషన్లు పెట్టారు.
ర్యాలీల్లో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించవద్దంటూ అనేక నిబంధనలతో పాదయాత్రకు అనుమతినిచ్చారు.
లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్ , జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల , పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు మాత్రమే వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది.