వైవిధ్యమైన, విలక్షణమైన, ఒకదానికొకటి ప్రత్యేకమైన చిత్రాలతో భారీ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు అడివి శేష్. కథల ఎంపికలో తనకంటూ ఓ స్టయిల్ ఉంది. శేష్ ‘గూఢచారి’ టాలీవుడ్ లో ఒక పాత్ బ్రేకింగ్ మూవీ. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. వీరి రెండో కలయికలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ‘మేజర్’ చిత్రం వచ్చింది. అది కూడా బ్లాక్ బస్టర్ అయింది.
‘మేజర్’తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన శేష్ తన తాజా తెలుగు సినిమా ‘హిట్ 2’ తో మరో బ్లాక్ బస్టర్ అందించాడు. ఇదే ఊపులో గూఢచారి 2 ప్రాజెక్టును ప్రకటించాడు. ఆ చిత్ర టీం “ప్రీ విజన్” వీడియోను జనవరి 9వ తేదీన ఢిల్లీ, ముంబై నగరాల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.
“మేజర్” చిత్ర ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శేష్ స్వయంగా కథ రాశాడు. ఈ భారీ-బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మూడు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లు కలసి నిర్మిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
గూఢచారి కథ మొత్తం భారతదేశంలోనే జరగగా, పార్ట్-2 అంతర్జాతీయంగా ఉండబోతోంది. ఆల్ప్స్ పర్వతాలలో సినిమా ముగిసిన ప్రదేశం నుండి పార్ట్ 2 ప్రారంభమవుతుంది.