గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆప్ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ మేరకు ప్రణాళికలు కూడా రచిస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే అభ్యర్థులను పార్టీ ప్రకటిస్తోంది. ఇప్పటికే నాలుగు విడతల్లో అభ్యర్థులను ఆప్ ప్రకటించింది.
తాజాగా ఈ రోజు ఐదవ విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఐదో విడత జాబితాలో 12 మందికి చోటు కల్పించింది. జాబితాలో భుజ్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి రాజేశ్ పండోరియా, ఇదార్ నుంచి జయంతిభాయ్ పర్ణమిలకు చోటు కల్పించింది.
నికోల్ నియోజక వర్గం నుంచి అశోక్ గజేరా, టంకారా నుంచి సంజయ్ భట్సన్, సబర్మతి నుంచి జస్వంత్ ఠాకోరీ, మహుధ నుంచి ఉదైసింగ్ నుంచి రవిజీభాయ్ సోమాభాయ్ వాఘేలా, కోడినార్ నుంచి వల్జీభాయ్ మక్వానాకు సీట్లను కేటాయించింది.
మోర్వా నుంచి బవాభా హడాఫ్, ఝలోద్, దేదీయపడ నుంచి చైతర్ వాసవ్, దామోర్ నుంచి అనిల్ గరాసియా, వ్యారా నుంచి బిపిన్ చౌదరి సుమకు ఆమ్ ఆద్మీ పార్టీ సీట్లు కేటాయించింది. 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 12 సీట్లలో కాంగ్రెస్ రెండు, బీజేపీ పది స్థానాల్లో విజయం సాధించాయి.