గాంధీ జయంతిని పురస్కరించుకొని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ… మహాత్మగాంధీకి అత్యంత ఇష్టమైనది ఖాదీ అని వెల్లడించారు.
గాంధీని ఆదర్శంగా తీసుకొని మోడీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, గాంధీ పేరును ఒక కుటుంబం రాజకీయ లబ్ధి కోసం వాడుకొంటుందని ఆయన మండిపడ్డారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి , భగత్ సింగ్, పటేల్ మహనీయులను మోడీ సర్కారు ఘనంగా గౌరవిస్తోందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో రెండు కుటుంబాలే పాలిస్తున్నాయని ఆయన విమర్శించారు. అన్నింటికి మీ పేర్లు పెట్టుకోవద్దు. రాష్ట్రంలో ఎంతోమంది త్యాగాలు చేసిన వారిని కూడా గుర్తు పెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఏపీ బీజేపీ సహ ఇన్ ఛార్జ్ సునీల్ దేవదర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను గతంలో చంద్రబాబు, ఇప్పుడు సీఎం జగన్ తమ పేర్లు పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.
ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీలు కుటుంబ పార్టీలు , అవినీతి పార్టీలు అని ఆయన ఆరోపించారు. గుంటూరులో జిన్నాటవర్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీకి అవకాశం ఇస్తే రాష్ట్రంలో ఉన్న మాఫియాను జైలుకు పంపుతామన్నారు.