సహచర ఆటగాడిపై నోరు పారేసుకున్నాడు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా. సహచర ఆటగాడితో పాండ్యా నడుచుకున్న తీరు.. నెటిజన్స్ కి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. క్రికెటర్ గా ఎంత టాలెంట్ ఉన్నా ఎదుటివారికి మర్యాద ఇవ్వడం నేర్చుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో తన ప్రవర్తనతో వివాదంలో నిలిచాడు పాండ్యా.
శ్రీలంక ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో 11వ ఓవర్ పూర్తయిన తర్వాత వాటర్ బాయ్ గా వాషింగ్టన్ సుందర్ గ్రౌండ్ లోకి వచ్చాడు. అయితే తనకు వాటర్ ఇవ్వలేదని 12వ ప్లేయర్ అయిన సుందర్ పై ప్యాండ్యా నోరుపారేసుకున్నాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవడి ….. ? అంటూ హిందీలో బూతులతో రెచ్చిపోయాడు.
పాండ్యా కామెంట్స్ స్టంట్ మైక్ లో రికార్డు అవ్వడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో హార్దిక్ పాండ్యా ఉపయోగించిన పదజాలంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మంచి నీళ్లు ఇవ్వకపోతే అంతలా దూషించాలా? అని కొందరు నెటిజన్లు పాండ్యాను ఏకిపారేస్తున్నారు.
టీ20 ఫార్మాట్ లో కెప్టెన్సీ, వన్డేల్లో వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ రావడంతో బలుపు ఎక్కువైందని ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా హార్దిక్ పాండ్యా తన ప్రవర్తనను మార్చుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ హితవు పలుకుతున్నారు.