ఏలూరు, తొలివెలుగు: కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య ఆమరణ దీక్షను విరమించారు. ఏలూరు ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న ఆయనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్ష విరమించుకోవాలని కోరారు. కాపు రిజర్వేషన్ల కోసం దీక్షకు దిగారు జోగయ్య.
పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చేర్చినా ఆయన దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. అయితే.. పవన్ కల్యాణ్ ఫోన్ చేసి అందరం కలసి కూర్చుని మాట్లాడుకుందామని, సమస్యపై చర్చించుకుందామని తెలిపారు. దీంతో ఆయన దీక్ష విరమించారు. పవన్ విజ్ఞప్తి చేయడం వల్లనే తాను దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు.
అన్ని రకాలుగా ఆలోచించి కార్యాచరణ రూపొందిద్దామని జోగయ్యకు పవన్ సూచించారు. మందులు కూడా వేసుకోకుండా దీక్షకు దిగడం బాధ కలిగిస్తోందన్న పవన్.. ఒక్కసారిగా ఇంతటి సాహసం చేస్తే ఎలా అంటూ మాట్లాడారు. పవన్ సీఎం కావాలి.. ఆయన ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నదే తన కోరికన్నారు జోగయ్య.
సీఎం జగన్ దిగి రావాలన్న ఆయన.. రాజకీయంగా ఆలోచన చేద్దామని పవన్ తనతో చెప్పినట్లు తెలిపారు.
పూర్తి కథనం…