• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » వైద్యుల నిర్లక్ష్యానికి..హరీశ్ రావు రాజీనామా చేయాల్సిందే..

వైద్యుల నిర్లక్ష్యానికి..హరీశ్ రావు రాజీనామా చేయాల్సిందే..

Last Updated: January 13, 2023 at 4:48 pm

మలక్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై టి కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. వైద్యం వికటించి బాలింతల ప్రాణాలు పోవడం అత్యంత దారుణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన ఆరోపించారు.

హృదయ విదారకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కనీసం బాలింతలను కాపాడలేకపోతుందని రేవంత్ విమర్శించారు. వైద్యం విషయంలో తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని,ప్రభుత్వ వైఖరి వల్లనే ప్రైవేట్ వైద్యం ఇక్కడ అభివృద్ది చెందుతోందని ఆయన చెప్పారు. ప్రపంచ స్థాయి అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో ఇంత ఘోరమా.. అని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వ వైద్యం పై పూర్తిగా నమ్మకం పోతోందని కామెంట్ చేశారు.

ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు బాలింతలు చనిపోయారని ఒక్కప్పటి ఘటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు  చేశారు.ఆగష్టు   చివరి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి బాలింతలు మృత్యువాత పడ్డారన్నారు. 4 నెలల్లోనే మళ్లీ ఈ సంఘటన జరిగిందని, హైదరాబాద్ లోనే ఇలా ఉంటే ఇక మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి.. అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులంటేనే ప్రజలకు భయం వేస్తోందన్న ఆయన.. వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావ్ మాటలకే పరిమితం అయ్యారని ఆరోపించారు.

ఈ సంఘటనకు ఆయనే బాధ్యత వహించి,తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృత్యువాత పడ్డ పేద,బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

కేసీఆర్ కు షూ చూపిస్తూ షర్మిల సవాల్

ఆయన బదిలీపై సంబరాలు..ఈయన బదిలీ వద్దంటూ నిరసనలు!

శ్రీకాకుళంలో వింత డ్రోన్‌ కలకలం!

నగరానికి చేరుకున్న యువ క్రికెటర్లు!

రంగంలోకి దిగిన ఆర్బీఐ.. స్థానిక బ్యాంకులతో టచ్ !

నగ ఎత్తుకెళ్ళిన నాటీ ఎలుక…!

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ఫిల్మ్ నగర్

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap