తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా రాహుల్ ను ఉద్దేశించి ట్విట్ చేశారు. రాష్ట్ర రైతుల పట్ల రాహుల్ గాంధీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో విమానాశ్రయంలో దిగగానే అర్థమైందని వ్యాఖ్యానించారు.
విమానాశ్రయంలో దిగిన తర్వాత ఏం మాట్లాడాలి.. సభ దేని గురించి అని అడిగినప్పుడే రాహుల్ కి వ్యవసాయం గురించే ఎంత అవగాహణ ఉందో తెలుస్తోందని అన్నారు. వరంగల్లో జరిగింది రైతు సంఘర్షణ సభ కాదని.. రాహుల్ సంఘర్షణ సభ అని ఎద్దేవా చేశారు.
పంజాబ్ రైతులు నమ్మని డిక్లరేషన్ ను.. చైతన్యమున్న తెలంగాణ రైతులు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతులే కాంగ్రెస్ ను ఈడ్చి తన్నారని విమర్శులు గప్పించారు.
తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస నేతలు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని హరీశ్ రావు ట్వీట్ చేశారు.