సల్మాన్ ఖాన్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘బజ్రంగీ భాయ్జాన్’. 2015లో విడుదలైన ఈ సినిమా సల్మాన్కు సకుటుంబ చిత్రంగా ఘన విజయాన్ని అందించింది. కబీర్ ఖాన్ దర్శకుడు. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సీక్వెల్కు ‘పవన పుత్ర’ అనే టైటిల్ను గతంలోనే ప్రకటించారు.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారట.ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్తో పాటు హీరోయిన్ కరీనా కపూర్ కూడా మంచి పేరు తెచ్చుకుంది.
సీక్వెల్లో ఆమె స్థానంలో మరో హీరోయిన్ను తీసుకోవాలనుకున్న మేకర్స్.. పూజా హెగ్డేను సంప్రదించారట. పూజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఆల్రెడీ ఓ సినిమాలో నటించడంతో ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.
అలాగే ఫస్ట్ పార్ట్ను డైరెక్ట్ చేసిన కబీర్ ఖాన్.. ఇప్పుడు రెండో పార్ట్ ను తెరకెక్కిస్తాడా లేదా వేరే దర్శకుడి చేతిలో పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుకి జంటగా నటిస్తోంది పూజాహెగ్డే. త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.