కేజీఎఫ్ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ , హీరో యష్ లకు కూడా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. కేజీఎఫ్ మొదటి భాగం దీని సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.
సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది.ఈ చిత్రంలో హీరోకి తల్లిగా ఈ చిత్ర కథాంశానికి ఒక అమ్మాయి కీలక పాత్ర పోషించటం జరిగింది.ఈ సినిమాలో రాకీ భాయ్ కి తల్లిగా నటించిన అమ్మాయి ఎవరంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఆ అమ్మాయి పేరు అర్చన జోస్. ఆమె 1994లో బెంగళూరు లో జన్మించింది. అర్చన కర్ణాటకలోని బెంగళూరులోని ఆక్స్మర్డ్ ఇంగ్లీష్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసి, అదే పాఠశాలలో నాట్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ కథాకళి లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.
అర్చన జోస్ తమిళనాడులోని తంజావూరులో శాస్త్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును కూడా పూర్తి చేసింది. అర్చన…మహాదేవి అనే కన్నడ సీరియల్ ద్వారా తొలిసారిగా నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ మహాదేవి సీరియల్ జీ కన్నడ లో ప్రసారం అయ్యేది. ఈ సీరియల్ లో ఆమె సుందరి పాత్రలో మెప్పించి నటన పరంగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఆ తర్వాత అర్చన కన్నడ చిత్రం కేజీఎఫ్ లో హీరో యష్ కు తల్లిగా నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కేజీఎఫ్ చిత్రంతో వెండితెరపై పరిచయమైంది నటి అర్చన.
27 ఏళ్ళ అర్చన కెజియఫ్ లో హీరో యష్ తల్లిగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కేజీఎఫ్ చిత్రం ద్వారా దేశ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి అర్చన జోస్.