• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » రాజ్ భవన్ ముట్టడి.. ఉద్రిక్తం..!

రాజ్ భవన్ ముట్టడి.. ఉద్రిక్తం..!

Last Updated: December 7, 2022 at 2:08 pm

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ పోరుబాట పట్టింది. రాజ్ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రాజ్ భవన్ రూట్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సీపీఐ నేతలు పెద్దఎత్తున ఖైరతాబాద్ చేరుకుని అక్కడి నుంచి రాజ్ భవన్ ను ముట్టడించేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు సీపీఐ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక సమయంలో తోపులాట కూడా చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండడంతో.. సీపీఐ నేతలు కూనంనేని, చాడాను పోలీసులు అరెస్ట్ చేశారు.

గవర్నర్‌ వ్యవస్థతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని సీపీఐ నేతలు మండిపడుతున్నారు. అందుకే ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్లులను ఎంత కాలం నిలుపుదల చేయాలో రాజ్యాంగంలో నిర్ధిష్టమైన గడువు లేకపోవడంతో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాజ్ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

కూనంనేని, చాడల అరె స్ట్‌పై సీపీఐ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. గవర్నర్ వ్యవస్థతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, అందుకే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు కూనంనేని. ప్రస్తుత రాష్ట్ర గవర్నర్‌ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.

కవితపై కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని.. అసలు లిక్కర్ కేసు ఏంటో అర్థం కావడం లేదన్నారు కూనంనేని. టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ లపై దాడులు చేశారని.. వాళ్ళు బీజేపీలో చేరగానే పునీతులు అయ్యారని అన్నారు. షర్మిలకు మోడీ ఫోన్ చేసి పలకరించే సమయం ఉంది కానీ… బీజేపీ రాష్ట్రాల్లో మహిళలపై దాడులు, హత్యలు చేసిన బాధితులను పరామర్శించే సమయం లేదా? అని అని ప్రశ్నించారు.

Primary Sidebar

తాజా వార్తలు

ప్రాణం పోయినా వెనకడుగు వేయను: మధుసూదన్ రెడ్డి

ఫార్ములా ఈ రేస్ ఎఫెక్ట్.. నరకయాతన పడుతోన్న నగర వాసులు

ప్రొఫెసర్ కాసీం అరెస్టు…!

బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్…!

దమ్ముంటే రాజీనామా చెయ్.. పువ్వాడ సవాల్!

షర్మిల నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రాకి వెళ్లిపో!

300 కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్!

నా పిల్ అడ్డుకుంటున్నారు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు… సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కార్…!

ఆ ఛీతాలు మా పార్టీకి చేటు.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే గోడు

అరుదైన రికార్డులకు దగ్గర్లో అశ్విన్!

ఒకే రోజు మూడు పరీక్షలు… ఆందోళనలో అభ్యర్థులు…!

ఫిల్మ్ నగర్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

ఆమెకు  ఆ  సినిమాల్లో రాని గుర్తింపు  అఖండతో  వచ్చిందిగా..!

ఆమెకు ఆ సినిమాల్లో రాని గుర్తింపు అఖండతో వచ్చిందిగా..!

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap